అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా సిరీస్ నేపథ్యంలో ముమ్మర ప్రాక్టీసు చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు.. గత వారం రోజులగా ప్రాక్టీసులో నిమగ్నమయ్యారు. ఇప్పటికే వన్డే, ట్వంటీ20 జట్లను బీసీసీఐ ప్రకటించిన నేపథ్యంలో మైదానంలోకి దూకేసిన క్రికెటర్లు కఠోర సాధన చేస్తున్నారు. రెండు ఫార్మాట్ల కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో పాటు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా జట్టుకు ఎంపికైన సభ్యులంతా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్లకు క్రమం తప్పకుండా హాజరవుతు ప్రాక్టీసు చేస్తున్నారు.
అయితే నిన్న కాస్తంత సేద తీరని ఆటగాళ్లు.. విడుదల కాని ఓ బాలీవుడ్ చిత్రాన్ని వీక్షించారు. వీరితో పాటు భారత స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల కూడా ఈ చిత్రాన్ని విడుదల కాకుండానే చేసింది. అదేంటి అంటున్నారా..? క్రీడాకారుల కోసం సినిమా నిర్మాత ఓ ప్రత్యేక షోను వేయించడంతో.. సినిమా ప్రీవ్యూను క్రీడాకారులు వీక్షించారు. ఇంతకీ అదేం సినిమా అంటారా..? కామెడీ నైట్స్ విత్ కపిల్ టీవీ షోతో సెలబ్రిటీగా మారిన కపిల్ శర్మ ప్రధాన పాత్రధారిగా బాలీవుడ్లో ''కిస్ కిస్ సే ప్యార్ కరూ'' చిత్రం రూపుదిద్దుకోవడంతో.. క్రీడాకారులందరూ ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేశారు. ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో బెంగళూరులో టీమిండియా క్రికెటర్ల కోసం చిత్ర నిర్మాతలు ఈ చిత్రం ప్రివ్యూను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ధోనీ సహా మిగిలిన క్రికెటర్లంతా ఈ సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more