టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని ఓ అరుదైన ఆటగాడు. వికెట్ కీవపింగ్ బ్యాటింగ్, సారధ్య బాధ్యతలు, బంతిబంతికీ మారే వ్యూహప్రతివ్యూహాలు.. వీటన్నింటినీ నిర్వహిస్తున్నా ఎంతో గ్రౌండ్ లో ఎంతో ప్రశాంతంగా వుండే క్రికెటర్ ఆయన. గత ఏడాది నుంచి ధోని టీమిండియా జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక తాజగా ఆయన రిటైర్మెంటుపై కూడా అనేక మంది పలు విధాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆ నిర్ణయం ఆయనదేనని, మరికోందరు ఇక ఆయన అవసరం తీరిపోయందని, మరికోందరు వుందని ఇలా ఎవరికి వారు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.
ఈ తరుణంలో ఆయన తరువాత ఆయన వారసుడు ఎవరన్న విషయమై బీసీసీఐలోనూ భారీ చర్చ జరుగుతోంది. ఢిల్లీ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరు మరింత ఎక్కువగా వినిపించింది. కానీ తనకు వచ్చిన అవకాశాలను పంత్ సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.ఈ నేపథ్యంలో, ధోనీకి సిసలైన వారసుడిగా మరో కొత్త పేరు తెరపైకి తెచ్చింది. కర్ణాటక క్రికెటర్ రాబిన్ ఉతప్ప దీనిపై మాట్లాడుతూ, రియాన్ పరాగ్ పేరును ప్రస్తావించాడు. టీమిండియాలో ధోనీ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా రియాన్ పరాగ్ కు ఉందని ఉత్తప్ప తెలిపాడు.
ధోనీ తర్వాత పరాగేనని, అతడ్ని భారత జట్టులో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఊతప్ప పేర్కొన్నాడు. పరాగ్ సామర్థ్యం దృష్ట్యా ఎక్కువ కాలం టీమిండియాకు సేవలు అందిస్తాడని వివరించాడు. కాగా, రియాన్ పరాగ్ పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ప్రశంసల జల్లు కురిపించాడు. ఆటపై పరాగ్ కు మంచి పట్టు ఉందని అన్నాడు. భవిష్యత్ లో మరింతగా ఎదుగుతాడని తెలిపాడు. అసోం రాష్ట్రానికి చెందిన పరాగ్ వయసు 18 ఏళ్లే. అసోం రంజీ జట్టు తరఫున దేశవాళీ పోటీలాడుతూ, ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఎంపికయ్యాడు. గత ఐపీఎల్ సీజన్ లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more