దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో అధికారులు ఎన్నిచర్యలు తీసుకున్నా సత్ఫాలితాలు మాత్రం రావడం లేదు. మరీ ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో అక్కడి ప్రజలను ప్రభావితం చేస్తోంది. ఇక ప్రజలను నియంత్రిచడంతో పాటు ఎవర్నీ ఇళ్లలో నుంచి బయటకు రాకుండా నిలువరిస్తూ.. అహర్నిషలు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కూడా కరోనా వైరస్ సోకడం చర్చనీయాంశంగా మారడంతో పాటు అందోళనకంగానూ మారింది.
దీంతో పోలీసులు ఎలాంటి పరిస్థితుల్లోనూ అధైర్యానికి గురికావద్దని కోరుకుంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి సినీనటి అనుష్క వారికి మనోధైర్యాన్ని అందించి పోలీసులకు అండగా తాము వున్నామని స్పష్టం చేశారు. అదెలా అంటూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులు సైతం కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో కోహ్లీ దంపతులు వారి సంక్షేమానికి విరాళం అందించారు. ఇద్దరూ చెరో రూ.5లక్షలు చొప్పున వారి సంక్షేమానికి అందజేశారు. ఈ విషయాన్ని ముంబయి పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ తెలిపారు.
విరాళం అందజేసిన విరుష్క దంపతులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కరోనాపై పోరుకు అంతకుముందు పీఎం-కేర్స్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా ఈ దంపతులు విరాళం అందించారు. అయితే, ఎంతమొత్తం ఇచ్చిందీ వారు వెల్లడించలేదు. దేశంలోనే అత్యధిక మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కేసుల సంఖ్య దాదాపు 20వేలకు చేరువైంది. అందులో సింహభాగం ముంబయిలోనే నమోదు అవుతుండడం కలవరపెడుతోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more