ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ పై తనకు విశ్వాసం లేదని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు. ఆస్ట్రేలియా ఏ విధంగా నంబర్ వన్ జట్టని ప్రశ్నించారు. 2016 అక్టోబర్ నుంచి టెస్టుల్లో నంబర్ వన్ గా కొనసాగుతున్న భారత్.. తాజా ర్యాంకింగ్స్ లో మూడో స్థానానికి పడిపోయింది. దీనిపై గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా న్యూజిలాండ్ తో మినహా అన్ని టెస్టు సిరీస్ లు గెలించిందని అన్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా గడ్డలపై విజయం సాధించిందని గంభీర్ గుర్తుచేశారు.
ఆసీస్ జట్టు ఇంటా, బయటా ఓటములు చవిచూసిందని, ఈ నేపథ్యంలో ఆ జట్టు ఎలా నంబర్ వన్ అయ్యిందని ఆయన ప్రశ్నించారు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పద్ధతితో పాటు ర్యాంకింగ్స్ పైనా తనకు విశ్వాసం లేదన్నారు. టీమిండియా టెస్టుల్లో మూడో స్థానానికి పడిపోవడంతో తనకేమీ ఆశ్చర్యం కలగలేదన్నారు. సహజంగానే తాను పాయింట్లు, ర్యాకింగ్ పద్ధతిని నమ్మబోనని, ముఖ్యంగా విదేశీ గడ్డలపై టెస్టు మ్యాచ్లు గెలిస్తే కూడా ఒకే స్థాయిలో పాయింట్లు కేటాయించడం సరికాదని గంభీర్ అభిప్రాయపడ్డారు.
ఇక ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవడంపై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. తన దృష్టిలో టీమిండియానే అగ్రస్థానంలో కొనసాగాలని తెలిపారు. ఈ ఏడాది చివర్లో ఇండియా ఆస్ట్రేలియా పర్యటనపై స్పందిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రస్తుతం కరోనా నిబంధనల ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. దీంతో భారత ఆటగాళ్లు ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు ఐసోలేషన్లో ఉంటారని ధుమాల్ చెప్పారు. ఈ నిర్ణయాన్ని గంభీర్ స్వాగతించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more