విధ్వంసక జట్టు వెస్టిండీస్ తో జరిగిన టీ20ల సిరీస్ ను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. ఈ సిరీస్ లో నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్ లో విండీస్ పై 67 పరుగులతో విజయం సాధించిన టిమిండియా.. 2-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ముంబైలో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో టీమిండియా జట్టు సమిష్టిగా రాణించడంతో పాటు టాప్ అర్ఢర్ బ్యాట్స్ మెన్ల వీరబాధుడు ముందు విండీస్ తలగ్గక తప్పలేదు. 241 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యఛేదనలో వెస్టిండియన్లు చివరికి 8 వికెట్లకు 173 పరుగులు మాత్రమే చేశారు.
ఆ జట్టులో కెప్టెన్ పొలార్డ్ 68 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. షిమ్రోన్ హెట్మెయర్ 41 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో విండీస్ కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో చహర్, భువీ, షమీ, కుల్దీప్ తలో 2 వికెట్లతో రాణించారు. అంతకుముందు టీమిండియా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (34 బంతుల్లో 71), కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 91), కెప్టెన్ కోహ్లీ (29 బంతుల్లో 70 నాటౌట్) అదరగొట్టారు. దాంతో టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
సిక్సర్ల వర్షం.. బౌండరీల జల్లు..
ముంబయి వాంఖెడే మైదానంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్ తమ బ్యాట్ ను ఝుళిపించారు. విండీస్ బౌలర్లపై తమ ప్రతాపాన్ని చాటారు. ఫలితంగా నిన్నటి మ్యాచ్లో సిక్సర్ల వర్షం.. బౌండరీల జట్టు కురిసిందంటే అతిశయోక్తి కాదు. భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసి ఓవర్ రేట్ ను ఆరు బంతులకు పన్నెండు పరుగులుగా నిర్ధేశించింది. రోహిత్ శర్మ (71), కేఎల్ రాహుల్ (91 నాటౌట్), కెప్టెన్ విరాట్ కోహ్లీ పోటాపోటీగా సిక్సర్లు బాదారు.
టీమిండియా ఇన్నింగ్స్ లో మొత్తం 16 సిక్సర్లు ఉండగా, వాటిలో కోహ్లీ కొట్టినవే 7 సిక్సులున్నాయి. రోహిత్ 5 సిక్స్ లు, రాహుల్ 4 సిక్స్ లు సంధించారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆట తీరే హైలైట్. అత్యధిక ఓవర్లు ముగిసిన తర్వాత బరిలో దిగినా విపరీతమైన దూకుడుతో కేవలం 29 బంతుల్లోనే 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాహుల్ సైతం విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 56 బంతుల్లో 91 పరుగులు చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more