భారత పర్యటనకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు వస్తుందని వార్తలు వెలువడినా.. ఇంకా పర్యటనకు వచ్చే క్రీడాకారుల పేర్లపై మాత్రం స్పష్టత కొరవడింది. భారత గడ్డపై సిరీస్ ఆరంభానికి ముందే బంగ్లాదేశ్కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ సైపుద్దీన్ గాయం కారణంగా జట్టుకి దూరమవగా.. సీనియర్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ వ్యక్తిగత కారణాలతో పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా భారత్ తో సిరీస్కి దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న ట్రైనింగ్ సెషన్ కు కూడా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ దూరంగా ఉన్నట్లు సమాచారం. కేవలం ఒకే ఒక సెషన్ కి హాజరైన షకీబ్.. చురుగ్గా ప్రాక్టీస్ కూడా చేయలేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. బంగ్లాదేశ్ ఆటగాళ్ల జీతాల పెంపు విషయమై ఇటీవల షకీబ్ అల్ హసన్ నాయకత్వంలోనే క్రికెటర్లు స్రైక్ చేయగా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వారి డిమాండ్లని పరిష్కరించేందుకు అంగీకరించింది. దీంతో.. ఆటగాళ్లు సమ్మెని విరమించారు. అయినా షకీబ్ అల్ హసన్ మాత్రం ఇంకా అసంతృప్తితో వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే.. ఈ సమ్మె జరుగుతున్న సమయంలోనే లోకల్ టెలికాం సంస్థతో షకీబ్ ఓ ఒప్పందం చేసుకున్నాడు. బోర్డు నిబంధనల ప్రకారం.. టెలికాం సంస్థతో క్రికెటర్ ఎలాంటి ఒప్పందాలు చేసుకోకూడదు. దీంతో.. అతనికి బంగ్లా క్రికెట్ బోర్డు షోకాజ్ నోటీసులు పంపింది. అయితే.. ఇప్పటి వరకూ షకీబ్ ఆ నోటీసులపై స్పందించలేదు. అయితే భారత్ తో జరిగే సిరీస్ కు కూడా ఆయన దూరంగానే వుండనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, నవంబరు 3 నుంచి మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్ని టీమిండియాతో బంగ్లాదేశ్ ఆడనున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more