దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో టీమిండియా స్వదేశంలో అత్యధికంగా 11 టెస్టు సిరీస్లను సొంతం చేసుకొని మరే జట్టుకు సాధ్యంకాని చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా ఇదివరకు స్వదేశంలో వరుసగా పది టెస్టు సిరీస్లు గెలుపొందగా కోహ్లీ సారథ్యంలోని భారత్.. దక్షిణాఫ్రికాపై రెండో టెస్టులో విజయం సాధించి ఆ రికార్డును అధిగమించింది.
ఇదిలా ఉండగా కోహ్లీ కెప్టెన్సీలోనే భారత జట్టు మరో రికార్డు చేరుకుంది. ఎనిమిదిసార్లు ఇన్నింగ్స్ తేడాతో విజయాలను అందించిన విరాట్.. గంగూలీ, అజహరుద్దీన్లను వెనక్కి నెట్టాడు. వీరిద్దరూ గతంలో భారత్ను చెరో 7సార్లు ఇలా గెలిపించారు. ఇక కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు అత్యధికంగా ఎనిమిదిసార్లు ఇన్నింగ్స్ పరుగుల తేడాతో విజయాలు నమోదు చేయడంతో అతడు అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ మరోసారి టీమిండియాను ఇన్నింగ్స్ పరుగుల తేడాతో గెలిపిస్తే ధోనీ రికార్డును సైతం బద్దలు కొడతాడు.
ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికాపై ఆదివారం సాధించిన విజయమే టెస్టుల్లో భారత్కు అత్యధిక ఇన్నింగ్స్ పరుగుల తేడా విజయం. కోల్కతా వేదికగా 2010లో ధోనీ సారథ్యంలోని భారత జట్టు ఇన్నింగ్స్ 57 పరుగులతో గెలుపొందింది. ధోనీ తర్వాత టీమిండియా బాధ్యతలు తీసుకున్న కోహ్లీ స్వదేశంలో ఎనిమిది టెస్టులకు నాయకత్వం వహించి అన్నిట్లో జట్టును గెలిపించాడు. ఇప్పటికే విజయవంతమైన కెప్టెన్గా పేరు తెచ్చుకున్న కోహ్లీ మొత్తంగా 50 టెస్టులకు సారథ్యం వహించి 30 మ్యాచ్ల్లో జట్టును విజయపథంలో నడిపించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more