టీమిండియా ప్రదర్శనలో మార్పేమీ కనిపించలేదు. అంతా ఎప్పుడెప్పుడు పెవీలియన్ కు వెళ్లిపోదామా అన్నట్లుగా పోటీపడ్డారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, చటేశ్వర్ పూజరాలు అర్థశతకాలతో రాణించారు. అయితే జట్టుకు అవసరమైన కీలక పరుగులను మాత్రం పేసర్ భువనేశ్వర్ ప్రసాద్ చేసి అకట్టుకున్నాడు. ఈ ముగ్గురు మినహాయిస్తే జట్టులోని మిగతా అటగాళ్లందరూ రెండు అంకెలకే పరిమితమయ్యారు. అసలు ఆచితూచి ఆడే ప్రయత్నమే చేయలేదు. కాసేపు ఒపిక పడదామన్న ఆలోచనే లేదు.
దీంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టు తొలి రోజే కోహ్లీసేన గాడి తప్పింది. కేవలం 187 పరుగులకే కుప్పకూలింది..! ఆఖర్లో భువనేశ్వర్ ఆదుకున్నాడు కానీ.. లేదంటే జట్టు 150 లోపే చాప చుట్టేసేదే..! ఆపై, మూడో ఓవర్లోనే ప్రత్యర్థి ఓపెనర్ వికెట్ తీసి భువీ భళా అనిపించాడు..! ఇక, రెండో రోజు అతనితోపాటు మిగతా పేసర్లు సఫారీలను ఏమేరకు కట్టడి చేస్తారనే దానిపైనే భారత భవితవ్యం ఆధారపడి ఉందిప్పుడు..
దక్షిణాఫ్రికా గడ్డపై భారత బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. బుధవారం ఇక్కడ మొదలైన మూడో, ఆఖరి టెస్టులో టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 187 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (54), చటేశ్వర్ పుజారా (50) అర్ధ శతకాలతో రాణించగా.. ఆఖర్లో భువనేశ్వర్ (30) గొప్పగా పోరాడాడు. కానీ, మిగతా బ్యాట్స్మెన్ అంతా కలిసి 27 పరుగులే చేశారు. ఒక్కరూ రెండంకెల మార్కు దాటలేదు.
ఆతిథ్య బౌలర్లలో రబాడ మూడు, మోర్కెల్, ఫిలాండర్, పెహ్లుక్వాయో తలో రెండు వికెట్లతో భారత్ను దెబ్బకొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా తొలిరోజు చివరకు 6/1తో నిలిచింది. ఓపెనర్ మార్క్రమ్ (2)ను భువీ అవుట్ చేశాడు. ఎల్గర్ (4 బ్యాటింగ్)తో పాటు నైట్ వాచ్మన్ రబాడ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఊహించినట్టే ఈ మ్యాచ్లో రోహిత్, అశ్విన్ స్థానాల్లో రహానె, భువనేశ్వర్ ను జట్టులోకి తీసుకున్నారు. అయితే భారీ అంచనాల మధ్య జట్టులోకి వచ్చిన రహానే.. కేవలం తొమ్మిది పరుగులకే పరిమితం కాగా, భువి మాత్రం అకట్టుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more