భారత్ అస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ లో తుదిపోరుకు రంగం సిద్దమైంది. హిమాచల్ ప్రదేశ్ వేదికగా ధర్మశాల స్టేడియంలో జరగనున్న తుది సమరంలో బ్యాట్స్ మెన్ల అసలైన ప్రతిభ బయట పడుతుందని అంటున్నారు పిచ్ క్యూరేటర్ సునీల్ చౌహాన్. ఆటగాళ్లలోని ప్రతిభా పాటవాల ప్రదర్శనకు కొలమానంగా తమ ధర్మశాల పిచ్ నిలుస్తుందని అంటున్నారాయన. నాలుగు టెస్టు సిరీస్ లలో మూడు మ్యాచ్ లు జరుగగా ఒక్క టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియగా, ఇరు జట్టు 1- 1తో సమంగా వున్న విషయం తెలిసిందే.
అయితే ఈ పిచ్ భారత్ లోని అన్ని పిచ్ లకు భిన్నంగా వుంటుందని, అన్ని పిచ్ లు స్పీన్నర్లకు అనుకూలంగా వుంటే ఈ పిచ్ మాత్రం పేసర్లకు అనుకూలంగా వుంటుందని క్యూరేటర్ తెలిపారు. తొలి రెండు రోజులు పేసర్లకు అనుకూలంగా వుండగా, ఆ తరువాత మూడు రోజులు మాత్రం బ్యాట్స మెన్లకు, స్నిన్నర్లకు కలసివస్తుందని అన్నారు. ఈ రకంగా పిచ్ ను తయారు చేసేందుక ప్రతీ ఏడాది తాము పిచ్ పోరపై వున్న సాయల్ ను తీసి మరో సాయిల్ తో దానిని రీప్లేస్ చేస్తామని అన్నారు.
కాగా స్పీన్నర్లకు అనుకూలంగా వుండే ఈ పిచ్ అసీస్ పేసర్లకు అనుకూలంగా మారుతుందని, దీంతో ఈ టెస్టులో తాము గెలిచి టెస్టు సిరీస్ ను కైవసం చేసుకంటామని అసీస్ అటగాళ్లు అశాభావం వ్యక్తం చేస్తుండగా, ఇటు జట్టు రాణించడంలో బ్యాట్స్ మెన్లతో పాటు బౌలర్లు ప్రతిభ కూడా పూర్తిగా వుంటుందని, ఈ క్రమంలో తమ జట్టులో వున్న టీమ్ స్పిరిట్, గెలవాలన్న అకాంక్ష తమను విజయతీరాలకు చేర్చుతుందని టీమిండియా వర్గాలు కూడా అశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తుది సమరంలో గెలుపెవరిదన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more