క్రికెట్ ప్రపంచంలో సహచర ఆటగాళ్ల నుంచి విదేశీ అటగాళ్లు, మాజీ దిగ్గజాలతో పాటు అభిమానుల ప్రశంసలను అందుకుని ముందుకు సాగిపోతున్న క్రికెట్ ఎవరో తెలుసా..? అయన మరెవరో కాదు టీమిండియ టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ టీమిండియా స్టార్ ఆటగాడు ఒక్క ఫార్మెట్ లో కాకుండా మూడు రకాల ఫార్మెట్లలో బాగా రాణించడంతో పాటు ప్రముఖల ప్రశంసలను కూడా అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ కూడా కోహ్లీ ఫాన్ క్లబ్ లో చేరిపోయాడు.
సుధీర్ఘ భారత పర్యటనకు తమ జట్టు వచ్చిన నేపథ్యంలో విరాట్ కోహ్లీకి సాటి ఎవరూ లేరని, ప్రస్తుతం ఆయనకు తానే సాటని పేర్కోన్నాడు. విరాట్ సాధించిన ఘనతలే అతని ప్రతిభకు అద్దం పడుతున్నాయని కొనియాడాడు. ఇదే క్రమంలో ఇంగ్లండ్ ఆశా కిరణం జో రూట్తో విరాట్ కోహ్లీని పోల్చడాన్ని పీటర్సన్ తప్పుబట్టాడు. విరాట్తో జోరూట్ను పోల్చడం అంత సబబు కాదన్నాడు.
విరాట్ సాధించిన ఘనతలు అతని గొప్పతనాన్ని చాటి చెపుతున్నాయి. సందేహం లేకుండా జో రూట్ ఒక మంచి ఆటగాడేనని అంగీకరిస్తూనే.. అతన్ని విరాట్ లో పోల్చడం సరికాదన్నాడు. జట్టు తరపున రూట్ కొన్ని కీలక ఇన్నింగ్స్లు కూడా ఆడాడని, కానీ కోహ్లీతో పాల్చడానికి ఇది సమయం కాదన్నాడు. విరాట్ అసాధారణమైన గణాంకాలతో చాలా ముందంజలో ఉన్నాడు. జట్టు కోసం తరచు భారీ స్కోర్లు నమోదు చేస్తూ అసాధారణమైన ఆట తీరును కనబరుస్తున్నాడు. ఈ రకంగా చూస్తే విరాట్ తో రూట్ పోలిక ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు'అని పీటర్సన్ తెలిపాడు.
త్వరలో భారత జట్టుతో ఇంగ్లండ్ ఆడబోయే సుదీర్ఘ టెస్టు సిరీస్లో రవి చంద్రన్ అశ్విన్ నుంచి ప్రమాదం పొంచి వుందని జట్టును హెచ్చరించాడు. ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించే సత్తా అశ్విన్ సొంతమనే విషయాన్ని మరచిపోకుండా జాగ్రత్తగా ఆడాలన్నాడు.'నేను అశ్విన్ చాలాసార్లు ఎదుర్కొన్నాను. నాకైతే అతని దూస్రా ఓకే.ఒకవేళ అతను దూస్రా ప్రయోగించకుండా వేరే అస్త్రాన్ని ప్రయోగిస్తే మాత్రం ఇంగ్లండ్కు ఇబ్బందులు తప్పవు' అని పీటర్సన్ అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more