పర్యాటక జట్టు న్యూజీలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ క్లీస్ స్వీప్ చేసి, ఇటు ఐదు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా క్రికెటర్లు.. వెనువెంటనే వచ్చిన దీపావళి పండుగ పర్వదినాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కాలం తరువాత కుటుంబ సభ్యులతో క్రికెటర్లు దీపావళి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక కొత్త పెళ్లికోడుకులు కూడా ఈ సరదాలు బాగానే అస్వాధించారు.
వరుస పర్యటనలు, సిరీస్ లతో తీరిక లేకుండా గడుపుతున్న క్రికెటర్లు ఇంగ్లాండ్ తో సుదీర్ఘ సిరీస్ లకు ముందు కాస్త విరామం లభించడంతో కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నారు. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఎంఎస్ ధోని తన భార్య, కూతురు కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాడు. పండుగ సందర్భంగా తీసుకున్న ఫొటోను ధోని భార్య సాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కాగా, అటు టీమిండియా ఓపెనర్ అజింక్యా రహానే తన భార్య దీపావళి పండగ సందర్భంగా వేసిన రంగోళి ముగ్గను ఇన్ స్టాగ్రామ్ పోస్టు చేసాడు. దీంతోనే తన సహచరులకు, అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాదు ఈ దీపావళి ఇంట్లో కుటుంబసభ్యులతో జరుపుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశాడు. అటు కోత్త పెళ్లి కోడుడు రోహిత్ శర్మ కూడా పండగను బాగా సెలబ్రేట్ చేసకున్నాడు, వరుసగా ఐదు వారాలు మ్యాచ్ లు ఆడిన తర్వాత కుటుంబం, స్నేహితులతో గడిపేందుకు విరామం దొరికిందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
కొత్త పెళ్లికోడుకు, వెటరన్ క్రికెటర్ల్ హర్భజన్, వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. స్నేహితులతో కలిసి టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరంద్ర సెహ్వాగ్ సరదాగా గడిపారు. ఇక తామకు భారతీయ సంస్కృతీ సంప్రదాయం అంటే ఇష్టమని విదేశీ క్రికెటర్లు కూడా చాటుకున్నారు. విదేశీ క్రికెటర్లు కూడా దీపావళి జరుపుకోవడం విశేషం. ఐపీఎల్ లో అందరి దృష్టిని ఆకర్షించిన వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ మరోసారి ప్రత్యేకత చాటుకున్నాడు. తన పిల్లలతో పాటు తాను కూడా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి పండగ చేసుకున్నాడు. తన భార్య, పిల్లలతో కలిసి ఉత్సాహంగా దీపావళి జరుపుకున్నామని వెల్లడించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more