పలువురు పాకిస్తాన్ క్రికెటర్లకు డోప్ టెస్టులు నిర్వహించారు. గతేడాది డోపింగ్ కు పాల్పడి కొంతకాలం నిషేధం ఎదుర్కొన్న యాసిర్ షాతో పాటు, టెస్టు కెప్టెన్ మిస్బావుల్-హక్లకు క్రికెట్ వరల్డ్ గవర్నింగ్ బాడీ డోప్ టెస్టులు నిర్వహించినట్లు పాకిస్తాన్ టీమ్ మేనేజర్ ఇంతికాబ్ అలమ్ శుక్రవారం ధృవీకరించారు. వచ్చే నెలలో పాక్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనున్న నేపథ్యంలో ఏ విధమైన పాజిటివ్ ఫలితం వచ్చినా అది జట్టుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నందున కొంతమంది క్రికెటర్లకు డోప్ టెస్టులు నిర్వహించినట్లు ఇంతికాబ్ పేర్కొన్నారు. మిస్బావుల్ హక్, యాసిర్ షాలతో పాటు, వన్డే కెప్టెన్ అజహర్ అలీ, ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్లకు డోప్ టెస్టులు నిర్వహించారు. అయితే వీరిలో యాసిర్ షాపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రధానంగా దృష్టిసారించినట్లు ఇంతికాబ్ తెలిపారు.
గతేడాది నవంబర్లో ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్ అనంతరం నిర్వహించిన డోపింగ్ టెస్టులో యాసిర్ పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో అతనిపై మూడు నెలల నిషేధం విధించారు. అయితే ఈ ఏడాది మార్చి నెలతో యాసిర్ పై విధించిన నిషేధం గడువు ముగిసింది. దీనిలో భాగంగానే ఇంగ్లండ్ కు వెళ్లే పాక్ జట్టులో యాసిర్ తో పాటు పలువురు క్రికెటర్లకు డోప్ టెస్టులు నిర్వహించారు. జూలై 14 నుంచి ఆరంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్ లో ఆతిథ్య ఇంగ్లండ్ తో పాక్ తలపడనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more