india-and-pakistan-bilateral-series-a-closed-chapter-shahryar-khan

Pcb decides to quit chasing indo pak series

PCB, BCCI, shahryar khan, Indo pak bilateral series, BCCI, Cricket, India, India-Pakistan series, Indo-Pak series, Pakistan, PCB, Sports, Sri Lanka,

The Pakistan Cricket Board has “given up” on the resumption of ‘much-awaited’ bilateral series against India after being unable to receive a necessary reply from the BCCI.

ఇండోపాక్ క్రికెట్ సిరీస్.. ఇక ముగిసిన అధ్యాయం

Posted: 12/14/2015 07:27 PM IST
Pcb decides to quit chasing indo pak series

భారత్ తో జరగాల్సిన ద్వైపాక్షిక క్రికెట్  సిరీస్ ఇక ముగిసిన అధ్యాయంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అభివర్ణించింది. ఇండో పాక్ సిరీస్ పై బీసీసీఐ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యాన్ ఖాన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ నెలలో బిసిసిఐ డిమాండ్ మేరకు శ్రీలంకలో జరగాల్సిన సిరీస్ పై బిసిసిఐ ఇంకా నాన్చివేత ధోరణిలోనే వ్యవహరిస్తుండటంతో ఇక ఈ సిరీస్ ముగిసిన అధ్యాయంగా అభివర్ణించారు. ఇంకా ఆ సిరీస్ పై తమకు ఎంతో కొంత ఆశలు ఉన్నప్పటికీ దానిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తాజాగా స్పష్టం చేశారు.
 
గత గురువారం భారత్-పాక్ ల క్రికెట్ సిరీస్ పై  బీసీసిఐకి షహర్యార్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్ కు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు. ఒకవేళ ఇరు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ జరగని పక్షంలో.. వచ్చే ఏడాది భారత్ లో జరిగే ట్వంటీ20 వరల్డ్ కప్ ను తమ జట్టు బాయ్ కాట్ చేస్తుందని ఆ లేఖలో హెచ్చరించారు. అయితే ఇప్పటివరకూ బీసీసీఐ దానిపై ఎటువంటి నిర్ణయాన్ని వెల్లడించకపోవడంతో షహర్యార్ సోమవారం మరోసారి మీడియా ముందుకొచ్చి అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఆ సిరీస్ పై ఆశగా ఎదురు చూశాం. బీసీసీఐ నుంచి ముందడుగు పడలేదు. గడిచిన శనివారం సాయంత్రంతోనే ఆ చాప్టర్ ముగిసిపోయింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దృష్టికి తీసుకువెళ్లడమే మా ముందున్న మార్గం' అని షహర్యార్ అన్నారు.

భారత్-పాకిస్థాన్ ల మధ్య ఈనెలలో యూఏఈలో ద్వైపాక్షిక సిరీస్ జరగాల్సి ఉంది. కొన్ని కారణాలు చూపుతూ యూఏఈలో ఆడటానికి భారత్ అంగీకరించలేదు. ఆ సిరీస్ ను భారత్ లో ఆడాలని పీసీబీకి విజ్ఞప్తి చేసింది బీసీసీఐ. దీన్ని పాకిస్థాన్ తిరస్కరించడంతో ఇరు దేశాల బోర్డు పెద్దల మధ్య దుబాయ్ లో చర్చలు అనివార్యమయ్యాయి. ఈ చర్చల్లో పరిమిత ఓవర్ల క్రికెట్ ను శ్రీలంక నిర్వహించేందుకు ఇరు దేశాల క్రికెట్ పెద్దలు మధ్య ఒప్పందం కుదిరింది.  కాగా శ్రీలంకలో ఆడేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం సమ్మతించినా.. భారత్ ప్రభుత్వం మాత్రం సానుకూలత వ్యక్తం చేయలేదు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. గత సంవత్సరం కుదిరిన ఎంఓయూ ప్రకారం 2015 నుంచి 2023 వరకూ ఇరు దేశాల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్ లు జరగాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PCB  BCCI  shahryar khan  Indo pak bilateral series  

Other Articles