దక్షాణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలి రోజున అధిపత్యం కొనసాగించిన సపారీలపై రెండవ రోజు టీమిండియా పైచేయిని సాధించింది. మూడవ రోజున ఏకంగా మ్యాచ్ ఫలితాన్ని రాబట్టింది. మహాత్మాగాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లో భాగంగా నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో 1-0తో అధిపత్యాన్ని కోహ్లీ సేన సాధించింది. మ్యాచ్ లో ఆద్యంతం స్పిన్నర్లే హావాను కొనసాగించారు.
దక్షిణాఫ్రికాతో సాగిన టీ-20, వన్డే సిరీస్ లో ఓటమిపాలైన టీమిండియా టెస్టుల్లో అయినా గెలుస్తుందా? అన్న అనుమానాలను పటాపంచలు చేసిన కోహ్లీ సేన తొలి టెస్టులో అద్భుతంగా రాణించి విజయాన్ని నమోదు చేసుకుంది.. భారత జట్టు 108 పరుగుల భారీ ఆధిక్యంతో అతిథ్యజట్టు సఫారీలపై విజయం సాధించింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రాణించడంతో తొలి టెస్టులో టీమిండియా తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కేవలం 201 పరుగులకే అలౌట్ అయింది. అనంతం తొలి ఇన్నింగ్స్ ఆడిన సఫారీలు కేవలం 184 పరుగులకే పెవిలియన్ చేరి, భారత్ కు 17 పరుగుల ఆధిక్యం ఇచ్చారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు టాప్ ఆర్డర్ రాణించడంతో అత్యంత క్లిష్టమైన పిచ్ పై 200 పరుగులు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సఫారీలను భారత స్పిన్నర్లు తిప్పేశారు. కేవలం 109 పరుగులకే సౌతాఫ్రికాను ఆలౌట్ చేసి సత్తా చాటారు. సఫారీ బ్యాట్స్ మన్ లో కేవలం ముగ్గురు ఆటగాళ్లే రెండంకెల స్కోరు చేయగలిగారు. తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ 5 వికెట్లతో రాణించగా, రెండో ఇన్నింగ్స్ లో ఆ ఫీట్ ను రవీంద్ర జడేజా సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో జడేజా 3 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ 3 వికెట్లు తీయడం విశేషం. దీంతో రెండో ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్ ను దారుణంగా దెబ్బతీసిన రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more