మొహాలీ వేడుకగా ప్రారంభమైన టెస్టు సిరీస్ తొలి రోజున అధిపత్యం కొనసాగించిన సపారీలపై రెండవ రోజు టీమిండియా పైచేయిని సాధించింది. అటు స్పిన్నర్లు బాగా రాణించి టీమిండియాకు మొదటి ఇన్నింగ్స్ లో 17 పరుగుల అధిపత్యాన్ని అందించిన నేపథ్యంలో ఇటు బ్యాట్స్ మెన్లు కూడా తమ అద్భుత అటతీరుతో భారత్ నిలదొక్కకునేలా చేశారు. మహాత్మాగాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లో భాగంగా తొలి టెస్టు రెండవ రోజు ఆటలో కోహ్లీ సేన పైచేయి సాధించింది.
తొలి రోజు టీమిండియాను ఆలౌట్ చేసి సమర్థవంతంగా అడ్డుకున్న సఫారీల ఇన్నింగ్స్ రెండో రోజు టీ విరామ సమయానికి ముగిసింది. 28 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టును టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్ బాటపట్టించాడు. టాపార్డర్ ను అశ్విన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత జడేజా, మిశ్రాల బంతులకు సౌతాఫ్రికా జట్టు రెండో రోజు ఆటలో టీ విరామానికి ముందే 184 పరుగులకు ఆలౌట్ అయింది. సఫారీ బ్యాట్స్ మన్ లో డివిలియర్స్ (63) రాణించాడు. దీంతో భారత జట్టుకు తొలి ఇన్నింగ్స్ లో 17 పరుగుల ఆధిక్యం లభించింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, ఆదిలోనే ధావన్ (0) వికెట్టును కోల్పోయింది. దీంతో మురళీ విజయ్ (47), ఛటేశ్వర్ పుజారా (63) మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేశారు. ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు సౌతాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా పదే పదే బౌలర్లను మార్చడం విశేషం. ఒక ఎండ్ లో బౌలర్లను మార్చిన ఆమ్లా, రెండో ఎండ్ లో కేవలం స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించాడు.
ఈ క్రమంలో స్టెయిన్ కు సబ్ స్టిట్యూట్ గా వచ్చిన బవుమా అద్భుతమైన క్యాచ్ కు విజయ్ పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన కోహ్లీ (11) అండగా పుజారా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ జోష్ తోనే ఈ టెస్టులో ఇప్పటి వరకు నమోదు కాని సిక్సర్ ను బాదాడు. రెండో రోజు 40 ఓవర్లు ఆడిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. దీంతో 142 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంకా 8 వికెట్లు చేతిలో ఉన్నాయి. భారత జట్టు మరో 200 పరుగులు చేయగలిగితే తొలి టెస్టులో విజయం సాధించవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more