ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్ లో 2-0తో విజయాన్ని నమోదు చేసుకున్న పాకిస్థాన్ తాజాగా ప్రకటటిచిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో తమ స్థానాన్ని మెరుగుపర్చుకుంది. రెండు స్థానాలు ఎగబాకి తాజాగా ప్రకటించిన ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్లో ద్వితీయ స్థానానికి చేరుకుంది. దీంతో టీమిండియా ఒక స్థానం ఎగబాకి నాల్గవ స్థానానికి చేరుకుంది. గురువారం షార్జాలో ముగిసిన మూడో టెస్టులో మిస్బావుల్ హక్ నేతృత్వంలోని పాకిస్థాన్ ఇంగ్లాండ్ జట్టుపై 127 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో 4వ స్థానంలో ఉన్న పాక్, 2 స్థానాలు ఎగబాకి అంతర్జాతీయ టెస్ట్ ర్యాంకింగ్స్లో ద్వితీయ స్థానానికి చేరుకుంది. అలస్టర్ కుక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ మూడో స్థానం నుంచి ఏకంగా 6వ స్థానానికి పడిపోయింది.
2006 తర్వాత పాకిస్థాన్ ద్వితీయ స్థానం రావడం ఇదే తొలిసారి. ఈ గెలుపుతో పాకిస్థాన్ 5 పాయింట్లు సాధించగా(101 నుంచి 106కు), సిరీస్ ఓటమి పాలైన ఇంగ్లాండ్ 3 పాయింట్లు చేజార్చుకుని 102 నుంచి 99 పాయింట్లకు పడిపోయింది. కాగా, ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 4 టెస్ట్ మ్యాచుల సిరీస్లో రాణిస్తే భారత ర్యాంకు మరిత మెరుగుపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. ఒకవేళ భారత్ టెస్ట్ సిరీస్ను 4-0తో గెలిస్తే ద్వితీయ స్థానానికి ఎగబాకే అవకాశం ఉంటుంది.
జట్టు రేటింగ్ పాయింట్స్
1. దక్షిణాఫ్రికా 125
2. పాకిస్థాన్ 106
3. ఆస్ట్రేలియా 106
4. ఇండియా 100
5. న్యూజిలాండ్ 99
6. ఇంగ్లాండ్ 99
7. శ్రీలంక 93
8. వెస్టిండీస్ 76
9. బంగ్లాదేశ్ 47
10. జింబాబ్వే 5
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more