టీమిండియా జట్టు నుంచి డ్రాప్ అయిన తర్వాత మళ్లీ జట్టులో స్థానం కోసం అందివచ్చిన రంజీ ట్రాఫీలో మ్యాచ్ లో కసితీరా అడాడని అల్ రౌండర్ రవీంద్ర జెడేజా అన్నారు. జట్టు నుంచి స్థానం కొల్పయిన తరువాత కొన్ని నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్నట్లు చెప్పాడు. 'రాక్స్టార్' జడేజా నాలుగు నెలలు పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరిస్ కోసం నిన్న (అక్టోబర్ 19)న తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. 26 ఏళ్ల రవీంద్ర జడేజా సౌరాష్ట్ర తరుపున రంజీ ట్రోఫీలో అత్యంత అధ్భుతంగా రాణించాడు. రంజీ ట్రోఫీలో జడేజా ఆడిన రెండు మ్యాచ్ల్లో రెండు అర్ధ సెంచరీలు సాధించడంతో పాటు లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు.
రంజీ ట్రోఫీలో అత్యుత్తమ ఆటతీరుని కనబర్చిన రవీంద్ర జడేజాకు సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి రెండు టెస్టు మ్యాచ్ల్లో ఆడేందుకు అవకాశం కల్పించారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టులో భజ్జీ స్థానంలో రవీంద్ర జడేజా చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది జూన్లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డేలో చివరిసారిగా జడేజా టీమిండియా తరుపున ఆడాడు. బీసీసీఐ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్యూలో రవీంద్ర జడేజా తన మనసులోని మాటను వెల్లడించాడు. జింబాబ్వే పర్యటన అనంతరం జట్టులో స్ధానం కోల్పోయిన తాను కొన్ని నెలలు పాటు క్రికెట్కు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.
క్రికెట్కు దూరంగా తన మనసుని పెట్టి, ఇతర పనుల్లో బిజీగా గడిపానని తెలిపాడు. తన ఫాంహౌస్లోని గుర్రం, స్నేహితులతో కాలక్షేపం చేసినట్లు తెలిపాడు. అనంతరం రంజీ సీజన్ మొదలు కాగానే తిరిగి ఎలాగైనా సరే జట్టులో చోటు దక్కించుకోవాలనే కసితో ఆడినట్లు తెలిపాడు. అందుకోసం జిల్లా స్థాయి మ్యాచ్లను సైతం ఆడాడని చెప్పిన జడేజా, రంజీ మ్యాచ్ల్లో సత్తా చాటానని పేర్కొన్నాడు. రంజీల్లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన జడేజా ఆడిన రెండు మ్యాచ్ల్లో చెలరేగి పోయిన సంగతి తెలిసిందే.
త్రిపురతో జరిగిన తొలి మ్యాచ్ లో 11 వికెట్లు తీసి సౌరాష్ట్ర గెలుపులో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అనంతరం జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో 13 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఐదు లేదా ఆరు నెలలపాటు మనమెంటే నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా, దక్షిణాఫ్రికాతో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో తొలి టెస్టు నవంబర్ 5 నుంచి మొహాలిలో ప్రారంభం కానుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more