ఆటంటే ఎప్పుడూ ఒకరిదే గెలుపు కాదు.. ఖచ్చితంగా గెలుపోటములు ఉంటాయి. అయితే తాజాగా టీమిండియా ఆడుతున్న సౌతాఫ్రికా నెల్సన్ మండేలా గాంధీ సిరీస్ టీమిండియా చెత్త ప్రదర్శన అందరికి కోపం తెప్పించింది. ఏకంగా టీమిండియా అభిమానులు తమ ఆగ్రహాన్ని క్రికెట్ మైదానం మీద చూపించారు. క్రికెట్ స్టేడియంలోకి బాటిళ్లు విసిరి తమ నిరసన తెలిపారు. అయితే టీమిండియా క్రికెటర్లలో ఎవరూ తమ సత్తా చాటకపోవడం పెద్ద దెబ్బ తీసింది. అయితే టీమిండియా పర్ఫామెన్స్ మీద పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అసలు టీమిండియా బౌలర్లు చెత్త బౌలింగ్ వేశారని.. ఎవరూ కూడా ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మెన్ లను అడ్డుకోలేకపోయారని అన్నారు. అలాగే అశ్విన్ తప్ప ఏ ఒక్క బౌలర్ తన బెటర్ పర్ఫామెన్స్ చూపించలేకపోయారని అన్నారు.
మ్యాచ్ కు మహ్మద్ షమి ఫిట్ కాలేకపోవడం.. ఉమేష్ యాదవ్ సెలెక్ట్ కాకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బ అని పాకిస్థాన్ సూపర్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు. రాబోయే మ్యాచుల్లోనైనా టీమిండియా తన స్ట్రాటజీని మారుస్తుందని అనుకుంటున్నట్లు షోయబ్ అన్నారు. ధోనీ తన కెప్టెన్సీని మరోసారి సరి చూసుకోవాలని సూచించారు. అంబటి రాయుడి ప్లేస్ ను అజరింకా రహానే భర్తీ చేయాలని కూడా షోయబ్ సలహా ఇచ్చారు. అయితే టీమిండియా అభిమానుల ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకుంటానని కానీ అలా తమ ఆటగాళ్లు బాగా ఆడలేదని మైదానంలోకి బాటిల్స్ విసరడం మంచిది కాదు అని అన్నారు. ఈ తరహా సంఘటనలు క్రికెట్ కు చెడు పేరు తీసుకువస్తాయని కూడా అన్నారు. మొత్తంగా టీమిండియాలో కొన్ని లోటుపాట్లున్నా కానీ ఖచ్చితంగా బెటర్ గా ఆడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more