టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఇటీవల కాలం అంతగా కలిసి రావడం లేదని అనిపిస్తోంది. ఇప్పటికే ఇతని కెప్టెన్సీ సరిగ్గా లేదని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్న ధోనీకి తాజాగా మరో షాక్ తగిలింది. అనంతపురం కోర్టు ఇతనికి సమన్లు జారీ చేసింది. నవంబర్ 7వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇంతకీ ధోనీకి ఏ విషయంలో కోర్టు సమన్లు జారీ చేసింది? అని సందేహిస్తున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!
‘ది గాడ్ ఆఫ్ బిగ్ డీల్స్’ శీర్షికతో బిజినెస్ టుడే తమ మేగజైన్ కవర్ పై ధోనికి విష్ణువు రూపంలో ప్రచురించిన చిత్రం తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే! ఆ సంస్థ తమ మేగజైన్ ను వినూత్నంగా ప్రచారం చేస్తూ.. ధోనీని విష్ణుమూర్తి అవతారంలో చూపిస్తూ.. అతని చేతుల్లో షూ సహా పలు వస్తువులను పెట్టింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి సామాజిక కార్యకర్త జయకుమార్ హీరేమత్.. ఆ చిత్రం హిందూ మతస్తుల మనోభావాలను, దేవుళ్లనూ దేవతలనూ కించపరిచారని ఆరోపిస్తూ ధోనీపై, ప్రచురణకర్తపై, సంపాదకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు నేపథ్యంలోనే కర్ణాటక హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు కాగా, ధోనీపై క్రిమినల్ కేసు నమోదైంది. అదే సమయంలో అనంతపురంలోనూ.. ధోనీ వేషధారణ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వుందని విశ్వాహిందూ పరిషత్ (వీ.హెచ్.పీ) పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన కోర్టు.. తాజాగా సమన్లు జారీ చేసింది. నవంబర్ 7వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.
ఇదిలావుండగా.. తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాల్సిందిగా ధోనీ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ కేసును విచారించిన ధర్మాసనం స్టే ఆర్డర్ ఇచ్చి ధోనీకి ఊరటనిచ్చింది. తొలుత కర్ణాటక హైకోర్టు విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు అనంతపురం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ధోనీ ఆ న్యాయస్థానానికి హాజరవుతాడో? లేదో? వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more