అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్న శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరకు టీమిండియా ఆటగాళ్లు గౌరవ వందనం పలికారు. భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండవ రోజన కుమార సంగక్కర బ్యాటింగ్ చేసేందుకు వస్తున్న క్రమంలో కొలంబో స్టేడియం చప్పట్లతో మార్మోగింది. కొలంబోలోని పి సారా ఓవల్ మైదానంలోకి అడుగుపెట్టగానే టీమిండియా ఆటగాళ్లు రెండు వైపులా లైన్లో నుంచొని చప్పట్లతో స్వాగతం పలుకుతూ గార్డ్ అఫ్ హానర్ (గౌరవ వందనాన్ని) పలికారు. 37ఏళ్ల కుమార సంగక్కర ఈ రెండో టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం అంతర్జాతీయ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకనున్నారు. ఈ నేపథ్యంలో కుమార సంగక్కర క్రీజులోకి అడుపెట్టేందుకు మైదానంలోకి రాగానే ప్రేక్షకులు లేచి నిలబడి తమ హర్షధ్వానాలతో సంగక్కర బ్యాటింగ్కు స్వాగతం పలికారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కరచాలనంతో సంగక్కరకు అభినందనలు తెలిపారు.
తన కెరీర్లో చివరి టెస్టు అయిన 134వ టెస్టు అడుతున్న కుమార సంగక్కర మోడ్రన్ క్రికెట్లో ఉన్న అతి కొద్ది గొప్ప బ్యాట్స్ మెన్లలో ఒకడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్న శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను బీసీసీఐ కూడా నిన్న సన్మానించింది. బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సంగక్కరకు జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. టెస్టు క్రికెట్లో కుమార సంగక్కర 57.71 సగటుతో 12,350 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 38 సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 404 వన్డేలు ఆడిన సంగక్కర 41.98 సగటుతో 14, 234 పరుగులు సాధించాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more