టీమిండియా క్రికెట్ మ్యాచ్ల ప్రసార హక్కులను పేటీఎంకు చెందిన సంస్ధ వన్97 కమ్యూనికేషన్స్ సొంతం చేసుకుంది. 2016 నుంచి వచ్చే నాలుగేళ్ల పాటు టీమిండియా క్రికెట్ మ్యాచ్ ప్రసార హక్కులను పేటిఎం సొంతం చేసుకుంది. ఇందుకోసం గాను టీమిండియా అడే ప్రతి మ్యాచ్కు రూ. 2.42 కోట్ల చొప్పున ఈ వన్97 కమ్యూనికేషన్స్ సంస్ధ బీసీసీఐకి ఫీజును చెల్లించనుంది. బిసిసిఐ మ్యాచ్ ల ప్రసార హక్కులను సోంతం చేసుకునేందుకు గతంలో క్యూ కట్టిన స్పాన్సర్లు ఈ సారి అంతగా మొగ్గుచూపలేదు. దీంతో ఎట్టకేలకు పేటిఎం సంస్థకు బిసిసిఐ ప్రసారహక్కలు దక్కాయి.
వన్97 కమ్యూనికేషన్స్కు ప్రతి మ్యాచ్కు రూ. 2.42 కోట్ల బిడ్తో 2019 వరకు ప్రసార హక్కులను కైవసం చేస్తూ బీసీసీఐ మార్కెటింగ్ కమిటీ గురువారం నిర్ణయం తీసుకుంది. రానున్న నాలుగేళ్ల కోసం పేటియం సంస్థ 242 కోట్ల రూపాయలను బిసిసిఐకి చెల్లించింది. దీంతో ఇకపై భారత్లో జరగనున్న రంజీ మ్యాచ్లు 'పేటీఎం రంజీ ట్రోఫీ'గా జరగనున్నాయి. 2019 వరకు బీసీసీఐ మొత్తం 86 మ్యాచ్లు (టెస్టులు, వన్డేలు, టీ20లు) నిర్వహించనుంది. ప్రసార హక్కులను పొందేందుకు గాను బిడ్లో మైక్సోమ్యాక్స్, పేటీఎంలు మాత్రమే పాల్గొన్నాయి. అయితే బిడ్లో పత్రాలను మైక్సోమ్యాక్స్ సమర్పించకపోవడంతో రద్దు చేశారు. కాగా బిసిసిఐ మీదు వున్న విశ్వాసాలకు, ఆసక్తితో పేటియం సంస్థ ఈ ప్రసార హక్కులను సోంతం చేసుకోవడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి అనురాగ్ శర్మ వారికి ధన్యవాదాలు తెలిపుతూ ట్విట్ చేశారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more