టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మిర్పూర్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే! ఈ మ్యాచులో ధోనీ సేన 79 పరుగుల తేడాతో బంగ్లా చేతిలో భారీ ఓటమిని చవి చూసింది. ఈ విషయం కాస్త పక్కనపెడితే.. ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కూల్ కెప్టెన్ ధోనీ ఈ మ్యాచులో కాస్త ఓవర్ గా ప్రవర్తించాడు. సమయానుకూలంగా ఆలోచించి కూల్ నిర్ణయాలు తీసుకునే ఈ డ్యూడ్.. ఈసారి తొందరపాటుతో తప్పటడుగు వేశాడు. ఇతని తప్పటడుగు దెబ్బతో దెబ్బతో బంగ్లా యువ బౌలర్ మైదానమే వీడాల్సి వచ్చింది. అంతే! ధోనీకి భారీ కోత పడింది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ టాపార్డర్ పూర్తిగా విఫలమయ్యారు. ఒక్కొక్కరు పవెలియన్ కు చేరుతుండగా.. ధోనీ వంతొచ్చింది. జట్టును గెలిపేందుకు అతగాడు రంగంలోకి దిగిన ఇతగాడు పూర్తిగా విఫలమయ్యాడు. కాగా.. ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి ధోనీ పరుగు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే బౌలర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ ధోనీకి అడ్డుగా వచ్చాడు. మనోడు చాలా బలిష్టంగా వున్నాడు కాబట్టి.. తనదారికి అడ్డుగా వచ్చిన ఈ కుర్ర బౌలర్ ని ధోనీ నిర్దాక్షిణ్యంగా నెట్టివేశాడు. దాంతో కెరీర్లోనే తొలి వన్డే ఆడుతున్న ఆ పేసర్ గాయపడి మైదానం వీడాల్సి వచ్చింది.
ఈ ఘటనపై విచారణ జరిపిన ఐసీసీ టీమ్.. ధోనీ లెవల్-2 నేరానికి పాల్పడినట్టేనని అభిప్రాయపడింది. ధోనీ కావాలనే బౌలర్ ను మోచేత్తో గట్టిగా పొడిచాడనే భావనకు వచ్చిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో 75 శాతాన్ని ఫైన్ గా విధించింది. కాగా.. ఈ కేసులో టీమ్ మేనేజర్ విశ్వరూప్ దేవ్ తో కలిసి విచారణకు హాజరైన ధోనీ తాను తప్పు చేసినట్లు అంగీకరించలేదని తెలిసింది. ఉద్దేశపూర్వకంగా ఆటగాడిని గాయపరచాలని తాను భావించలేదని ధోని వాదించినట్లు సమాచారం! అయితే.. గాయపడ్డ రెహమాన్ మాత్రం ‘ఆ సమయంలో నేనో తప్పు చేశాను’ అని అంగీకరించినట్లు బంగ్లా పత్రికల్లో వార్తలు వచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more