ముక్కోణపు సిరీస్’లో భాగంగా మెల్బోర్న్’లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ - డేవిడ్ వార్నర్’కు మధ్య జరిగిన గొడవలో వార్నర్’దే తప్పు వుందంటూ ఐసీసీ అతనికి భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే! ఓ మ్యాచ్ నుంచి నిషేధించడంతోబాటు అతని పీజులో నుంచి 50 శాతం కోత విధించింది. ఈ వ్యవహారంలో అతగాడికి తన సొంత బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)నుంచి కూడా మద్దతు లభించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వార్నర్.. గొడవ సారంశమేంటో మొత్తం వివరించాడు. తన తప్పు లేకున్నా అనవసరంగా భారీ మూల్యం విధించారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
జరిగిన సంఘటనలో తన తప్పేమీ లేదని పేర్కొంటున్న ఈ కంగారూ ఆటగాడు.. ఆ సమయంలో తాను రోహిత్’ను కేవలం ఇంగ్లీష్’లో మాట్లాడమని మాత్రమే అడిగినట్లుగా వివరణ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ.. ‘నిబంధనల ప్రకారం ఆ సమయంలో పరుగు తీయకూడదు. దానిపై మా ఆటగాళ్లతో వాదన జరుగుతున్న సమయంలో నేనూ అక్కడికి వెళ్లాను. అప్పుడు రోహిత్ తన మాతృభాష హిందీలో ఏదో మాట్లాడాడు. అది అర్థంకాక ఇంగ్లీష్’లో మాట్లాడమని మాత్రమే నేను చెప్పాను. అప్పుడతను ఇంగ్లీష్’లో మాట్లాడాడు. అతను ఏం చెప్పాడో నేను చెప్పలేను కానీ.. నేను జోక్యం చేసుకోకుండా వుంటే బాగుండేది’ అని స్పష్టం చేశాడు.
అయితే జరిగిన వ్యవహారంలో తనకు అంత భారీ మూల్యం విధించడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా తనపై అన్యాయంగా ఇంత జరిమానా విధించడం న్యాయంగా లేదంటూ బాధపడినట్లుగా సహచరులు తెలుపుతున్నారు. ఇంతమాత్రానికే అంతగా రియాక్ట్ అవుతారని తెలిసి వుంటే.. తానసలు జోక్యం చేసుకునేవాడు కాదని చెబుతున్నారు. అలాగే సీఏ సీఈ జేమ్స్ సదర్లాండ్ ఈ రచ్చపై మాట్లాడుతూ.. ‘నేను వార్నర్’తో మాట్లాడాను. అతను ఎలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయలేదని చెప్పాడు’ అని చెప్పిన ఆయన.. వార్నర్’పై నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more