(Image source from: Indian cricket team lost t20 match with england team)
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచుల సిరీస్ ను కైవసం చేసుకున్న నేపథ్యంలో ప్రశంసలు అందుకున్న టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ... మరోసారి జట్టు పరాజయానికి కారకుడై విమర్శలను ఎదుర్కొంటున్నాడు. గెలిపిస్తాడనే నమ్మకాన్ని అందరిలో చివరిదాకా నమ్మకాన్ని కలిగించి, ఊరించిన ఈ వీరుడు... ఫైనల్ గా చేజేతులారా జట్టుని ఓడించి అందరినీ నిరాశపరిచాడు. గతంలోలాగే ఈసారి కూడా తన మ్యాచ్ ను తన ఫినిషింగ్ టచ్ తో ముగిద్దామని భావించిన ధోనీకి.. ఈసారి ఆ మంత్రం మాత్రం పనిచేయకుండా పోయింది. ప్రపంచకప్ లో టీమిండియాకు ధోనీ ఏవిధంగా ఫినిషింగ్ టచ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడో తెలిసిందే! అదే తరహాలో ఈసారి చేయాలనుకున్నప్పటికీ... అతనికి సాధ్యం కాలేదు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు తమ ఆట తీరుతో 180 పరుగులు సాధించి, ఇండియన్ బౌలర్లకు బాగానే పనిపెట్టారు. వీరిలో మోర్గాన్ ఇండియన్ ఆటగాళ్లను బాగానే పరుగులు తీయించాడు. 71 పరుగులు తీసి, ఇంగ్లాండ్ జట్టుకు అండగా నిలిచాడు. ఇక హేల్స్ కూడా 40 పరుగులతో బాగానే ఆడాడు. చివరికి ఇంగ్లాండ్ మొత్తం 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 180 పరుగులను సాధించింది. ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే.. షమీ ఒక్కడే 4 ఓవర్లకు గాను 38 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. మోహిత్ శర్మ, కరణ్ శర్మ, జడేజాలు ఒక్కొక్కరు ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు.
181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఓపెనర్స్ రాగానే తమ బాదుడుతో కొద్దిసేపటివరకు బాగానే హడలెత్తించారు. ఇలా బరిలోకి దిగిన ప్రతిఒక్క బ్యాట్స్ మెన్ తమతమ ప్రతిభకు తగ్గట్టు బాగానే ప్రదర్శించారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ కోహ్లీ ఈ మ్యాచ్ లో చెలరేగిపోయాడు. మొత్తం ఇన్నింగ్స్ లో ఇతనొక్కడే 66 పరుగులు చేసి, ఇంగ్లాండ్ జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. అయితే అతడు పవెలియన్ చేరగానే ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. కోహ్లీ ఔటయిన వెంటనే రైనా, జడేజాలు కూడా పవెలియన్ చేరిపోవడంతో భారత్ శిబిరం ఒత్తిడిలో కూరుకుపోయింది. అయినప్పటికీ ఆటగాళ్లు చివరిదాకా నెగ్గుకువచ్చారు కానీ.. ధోనీ విలన్ గా నిలిచాడు.
భారత్ లక్ష్యం చివరి ఓవర్ లో 17 పరుగులు చేయాలి. భారత్ విజయం సాధిస్తుందా లేదా అంటూ అందరిలో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. క్రీజులో వున్నది ధోనీ.. లక్ష్యం ఓవర్ కి 17 పరుగులు! అందరూ ఊహించినట్లుగానే ధోనీ మొదటి బంతికే సిక్సర్ బాదేశాడు. అంతే! అభిమానులు కేకలే కేకలు! దీంతో మ్యాచ్ గెలవడం ఖాయమని అందరిలో ఆశలు చెలరేగిపోయాయి. రెండో బంతికి రెండు పరుగులు సాధించాడు. ఇక కావలసింది 4 బంతులకు 9 పరుగులు మాత్రమే. ఈ దశలో భారత్ విజయం లాంఛనమ కావాలి. అయితే మూడో బంతిని ధోనీ మింగేశాడు. సింగిల్ వచ్చే అవకాశం వున్నా.. తీయలేదు. పైగా రెండో ఎండ్ లో రాయుడు వున్నప్పటికీ.. ధోనీ సింగిల్ తీయలేదు.
ఇక నాలుగో బంతిని బౌండరీకి పంపాడు. దీంతో రెండు బంతులకు 5 పరుగులు మాత్రమే! ఏమౌతుందో.. ఏమోనంటూ అందరిలో ఉత్కంఠ! ఇక ఐదోబంతికి ధోనీ అసలుకే మింగేశాడు. సింగిల్ అవకాశం వున్నప్పటికీ రాయుడిని వెనక్కు పింపించేశాడు. లక్ష్యం 1 బాలుకు 5 పరుగులు. ఆఖరి బంతికి ఫోర్ కొడితే టై.. సిక్సర్ కొడితే విజయం. కానీ ధోని మాత్రం కేవలం ఒక్క పరుగే చేశాడు. తనపై తనకు నమ్మకమో... రాయుడు మీద అపనమ్మకమో కానీ... రెండు సింగిల్స్ వదిలేసి రిస్క్ తీసుకున్న ధోని ఇంగ్లండ్తో ఏకైక టి20లో భారత్ను చేజేతులా ఓడించాడు. ధీంతో భారత్ 3 పరుగుల తేడాతో మ్యాచ్ ను ఓడిపోయింది.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more