ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ ఆటగాళ్లలో దిగ్గజ వీరుడిగా పేరు పొందిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు త్వరలోనే ఒక అరుదైన గౌరవం దక్కనుంది. ఇప్పటికే క్రికెట్ రంగంలో వున్న అన్నిరికార్డులను తన సొంతం చేసుకుని ఢంకా బజాయించిన సచిన్.. ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైన గుర్తింపును సొంతం చేసుకోనున్నాడు. అయితే ఈ విషయం మీద బీసీసీఐ మాత్రం తర్జనభర్జనలో మునిగిపోయింది. సచిన్ కు దక్కుతున్న ఈ సరికొత్త గౌరవ విషయంలో ఇంకా తుదినిర్ణయాన్ని మాత్రం వెలువరించలేదు.
బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయాల ప్రకారం.. ‘‘మాస్టర్’’ సచిన్ పేరును ఏదో ఒక దేశంతో జరిగే క్రికెట్ సిరీస్ కు పెట్టి గౌరవించాలని భావిస్తోంది. ఈ నెల(సెప్టెంబర్)లోనే జరిగే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించి, ఒక తుది నిర్ణయానికి వస్తారు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. సచిన్ కు సమానస్థాయి వున్న దిగ్గజాలు గల క్రికెట్ జట్లతో ఇప్పటికిప్పుడే ఏ మ్యాచ్ లు లేవు. సచిన్ తో సరితూకంగా వున్న దిగ్గజ ఆటగాడు వున్న జట్టుతో మ్యాచ్ నిర్వహించిన నేపథ్యంలోనే ఆ సిరీస్ కు సచిన్ పేరును పెట్టాలని బీసీసీఐ ఖరారు చేసింది. దీంతో ఈ విషయంలో అది కాస్త తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం!
ప్రస్తుతం అందుబాటులో వున్న ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తే.. పాకిస్తాన్ జట్టుతో ఇండియా జట్టుకు మధ్య శత్రుత్వం పచ్చిగడ్డి మీద భగ్గుమనేంత స్థాయిలో వుంది కాబట్టి.. వారితో జరిగే సిరీస్ కు సచిన్ పేరును కేటాయించాలనుకున్నారు. అయితే పాకిస్తాన్ తో ఎప్పుడు సిరీస్ జరుగుతుందో, ఎప్పుడు జరగదో అనే విషయం మాత్రం క్లారిటీ లేదు. ఇక దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లో సచిన్ కు సమానస్థాయి దిగ్గజాలు లేరు. అయితే వెస్టిండీస్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆటగాడిగా పేరు నమోదు చేసుకున్న రిచర్డ్స్ ఆటగాడు వుండటంతో.. త్వరలోనే ఆ జట్టుతో జరగబోయే సిరీస్ కు సచిన్ పేరును పెట్టేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ విషయంలో ఇంకా క్లారిఫికేషన్ మాత్రం ఇవ్వడం లేదు. కానీ.. బీసీసీఐ అంతర్గత సమాచారం ప్రకారం.. వెస్టిండీస్ తో జరిగే సిరీస్ కే సచిన్ పేరును ఖరారు చేయనున్నట్టు పక్కా సమాచారాలు వెలువడుతున్నాయి. దీంతో వచ్చే నెల(అక్టోబర్)లో ఇండియాలోనే వెస్టిండీస్ తో భారత్ ఆడే సిరీస్ కు ‘‘సచిన్ - రిచర్డ్స్’’ ట్రోఫీని ఏర్పాటు చేస్తే మేలనే ప్రతిపాదన వుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సచిన్ చివరి మ్యాచ్ ను ఆడింది కూడా వెస్టిండీస్ పైనే! దీంతో బీసీసీఐ ఈ సిరీస్ కే సచిన్ పేరును పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెలాఖరులోగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more