ఐపీఎల్ సీజన్ - 7 లో లీగ్ దశ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి. టోర్నీలో ఉన్న జట్లన్నింటికి తలో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే పంజాబ్, చెన్నై, కోల్ కత్తాలు ప్లే ఆఫ్ కి అర్హత సాధించాయి. ఇక మిగిలి ఉన్న మరో స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. టోర్నీ ఆరంభంలో మంచి ఫలితాల్ని సాధించి, ప్లే ఆఫ్ కి వెళ్ళడానికి పెద్ద కష్టడాల్సిన అవసరం లేదనుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు క్లిష్ట పరిస్థితి తెచ్చుకుంది.
వరుసగా మూడు ఓటములతో బెర్తును సంక్లిష్టం చేసుకుంది. ఇక ముంబై చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో నెగ్గి ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ 16 పరుగులతో ఓడి, ముంబైతో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. రేపు జరగనున్న ఆఖరి లీగ్ మ్యాచ్ (ఆదివారం) ద్వారానే ప్లే ఆఫ్ తుది బెర్త్ ఖరారు కానుంది. పీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది.
మార్ష్ (35 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), మిల్లర్ (20 బంతుల్లో 29 నాటౌట్; 2 సిక్సర్లు), సాహా (20 బంతుల్లో 27; 4 ఫోర్లు), బెయిలీ (18 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), వోహ్రా (20 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు జత చేశారు. బెయిలీ, మిల్లర్ ఐదో వికెట్కు 32 బంతుల్లో అజేయంగా 60 పరుగులు జోడించడంతో పంజాబ్ భారీ స్కోరు చేసింది.
రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఫాల్క్నర్ (13 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు), హాడ్జ్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), శామ్సన్ (29 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్), రహానే (26 బంతుల్లో 23; 2 ఫోర్లు) రాణించారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో రాజస్థాన్ కోలుకోలేకపోయింది. చివర్లో హాడ్జ్, ఫాల్క్నర్ మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more