ఐపీఎల్ అంటేనే ఎప్పుడు ఏ ఆటగాడు మెరుస్తాడో... ఏం అద్బుతాలు జరుగుతాయో చెప్పలేం. ఓటమి ఖాయం అనుకున్న జట్లు కూడా గెలుపు బాటలో, విజయం ఖాయం అనుకున్న జట్లు ఓటమి చవిచూస్తాయి. ఇదంతా ఐపీఎల్ మాయ. ఇక అసలు విషయానికి వస్తే.... రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అతి కష్టం మీద తక్కువ పరుగులే చేసిన చెన్నై జట్టు రవీంద్ర మాయాజాలంతో అద్బుత విజయం సాధించి వరుసగా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
టాస్ గెలిచి చెన్నైని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. చెన్నై జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు అతి కష్టం మీద 140 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్ (28 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు వేగంతో అర్ధసెంచరీ చేయగా... చివర్లో జడేజా (33 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
రాజస్థాన్ ముంగిట పెద్ద లక్ష్యం ఏం లేదు. ఆ జట్టలో ఉన్న బ్యాట్స్ మెట్స్ చెలరేగితే చెన్నైకి ఓటమి తప్పదనుకున్నారు. బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ మొదటి నుండే దూకుడుగా ఆడుతూ ఉన్నారు. కానీ రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో వాట్సన్, సామ్సన్ వికెట్లు తీసి కష్టాల్లోకి నెట్టాడు.తరువాత వచ్చిన స్మిత్ కాస్తంత దూకుడుగా ఆడినా చివరల్లో బంతి చేతిలోకి తీసుకున్న జడేజా రెండు ఓవర్లలో స్మిత్, సౌతీల వికెట్లు తీసి రాజస్థాన్ ని కోలుకోని దెబ్బ కొట్టాడు.
దీంతో 19.3 ఓవర్లలో రాజస్థాన్ 133 పరుగులు మాత్రమే చేసి విజయం ముంగిట బోల్తా కొట్టింది. రాజస్థాన్ జట్టులో ధావల్ కులకర్ణి (19 బంతుల్లో 28 నాటౌట్; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. భాటియా (20 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్సర్), స్మిత్ (20 బంతుల్లో 19; 1 ఫోర్) మోస్తరుగా పోరాడినా విజయం దక్కలేదు. తన స్పిన్ మాయా జాలంతో 4 వికెట్లు తీసి, విజయాన్ని అందించిన జడేజాకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’ అవార్డు వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more