ఆసియాకప్ లీగ్ మ్యాచ్ లో భాగంగా ఖాన్ సాహెబ్ ఉస్మాన్ ఆలీ స్టేడియంలో జరిగిన భారత్ - బంగ్లా లీగ్ మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. అగ్రశ్రేణి జట్టు అయిన భారత్ కి బంగ్లా గట్టి పోటీని ఇచ్చింది. బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ తన అద్బుతమైన ప్రతిభను కనబర్చింది. 279 భారీ స్కోరు చేసిన బంగ్లాకు చివరకు ఓటమి మాత్రం తప్పలేదు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి భారత్ కి అద్భుతమైన విజయాన్ని అందించాడు. బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ సెంచరీ తో ఒంటరి పోరాటం చేసి భారీ స్కోరును అందించాడు.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. అనాముల్ హక్ (106 బంతుల్లో 77; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపిస్తే... బంగ్లా కెప్టెన్ రహీమ్ (113 బంతుల్లో 117; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేశాడు. కెరీర్లో రెండో శతకాన్ని పూర్తి చేసుకున్న ముష్ఫికర్ ఇన్నింగ్స్ చివర్లో అవుటయ్యాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లు పడగొట్టాడు. ఆరోన్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు.
బంగ్లా నిర్దేశించిన విజయ లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్ కి దిగిన భారత్ ఆదిలో కాస్తంత తడబాటుకు గురైంది. ధావన్ (44 బంతుల్లో 28; 5 ఫోర్లు), రోహిత్ (29 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్సర్)లు వరుస ఓవర్లలో అవుట్ కావడంతో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. తరువాత వచ్చిన కోహ్లీ , రహానే నెమ్మదిగా ఆడుతూ.. అవసరం అయినప్పుడు పరుగల వేగాన్ని పెంచాడు.
మూడో వికెట్కు 213 పరుగుల భాగస్వామ్యం నెలకొన్న తర్వాత ఈ జోడి స్వల్ప వ్యవధిలో అవుటయింది. తర్వాత భారత్ విజయ లాంఛనాన్ని రాయుడు (9 నాటౌట్), కార్తీక్ (2 నాటౌట్) పూర్తి చేశారు. రూబెల్, రెహమాన్, రజాక్, గాజి తలా ఓ వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ ఆసియా కప్ లో భోణి కొట్టింది. ఆదివారం రోజున పాకిస్థాన్ తో తలపడనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more