అల్లుడు చేసిన నేరానికి మామ శిక్ష అనుభవించినట్లుంది బీసీసీఐ శ్రీనివాసన్ పని. బీసీసీఐ అధ్యక్షుడు అయిన శ్రీనివాసన్ తన అల్లుడు గురునాథన్ మెయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ మీద వచ్చిన బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించిన ఆరోపణల కారణంగా గత కొంత కాలంగా బోర్డు బాధ్యతలకు దూరంగా ఉంటున్న శ్రీనివాసన్ కి అధ్యక్ష పదవి చేపట్టేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత నెల 29న ఏజీఎంలో మరో ఏడాదిపాటు ఆయన బోర్డు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అయితే ఆయనకు వ్యతిరేకంగా బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) కేసు వేయడంతో తీర్పు వచ్చేదాకా పదవికి దూరంగా ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బాధ్యతలకు దూరంగా శ్రీనివాసన్ ఐపీఎల్ వ్యవహారాల్లో తలదూర్చకుండా బోర్డు అధ్యక్షుడిగా తన విధులు నిర్వర్తించుకునేందుకు జస్టిస్ ఏకే పట్నాయక్, జేఎస్ కేహర్తో కూడిన బెంచ్ తీర్పును వెలవరించడంతో శ్రీనివాసన్ కి ఊపిరి సడలినట్లయింది. దాదాపు నాలుగు నెలల అనంతరం ఆయన బోర్డు కార్యకలాపాల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. ఇక స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారానికి సంబంధించి విచారణ చేపట్టేందుకు ముగ్గు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది.
కమిటీకి హర్యానా, పంజాబ్ ప్రధాన న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ నేత్రుత్వంలో అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్. నాగేశ్వర్ రావు, అస్సాం క్రికెట్ సంఘం సభ్యుడు నిలయ్ దత్తా సభ్యులుగా నియమించింది. నివేదికను నాలుగు మాసాల్లో కోర్టుకు సమర్పించాలని, విచారణలో జోక్యం చేసుకోరాదని, కమిటీకి సహకరించాలని ఆదేశించింది. ఆరోపణల పై కమిటీ విచారణ జరుపుతుందని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more