ఐదు వన్డేల ‘సిరీస్ సెల్కాన్ కప్ ’లో భాగంగా నేడు జింబాబ్వే, భారత్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. భారత బ్యాట్స్ మెన్స్ విరాట్ కోహ్లీ సెంచరీతో , తెలుగు తేజం అంబటి రాయుడు హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా 44.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలించింది. మొదట టాస్ గెలిచిన భారత్ ఫీల్టింగ్ ఎంచుకుంది. జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 228 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే ఆటగాళ్లలో సిందకర్ రాజా 82, చిగుంబుర 43, సిబాంద 34, విలియమ్స్ 15 పరుగులు చేశారు. ఓపెనర్లు విసు సిబంద, సికిందర్ రజా శుభారంభాన్నే ఇచ్చినా జట్టు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా 3 వికెట్లు పడగొట్టాడు. వినయ్ కుమార్, మహ్మద్ షమీ, ఉనాద్కత్, రైనా కట్టడిగా బౌలింగ్ చేయడంతో తక్కువ స్కోరుకే నిలువరించగలిగారు.
జింబాబ్వే నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యాన్ని భారత్ 44.5 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి 115, అంబటి రాయుడు 63 (నాటౌట్) పరుగులతోనూ భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. రోహిత్ శర్మ 20, శిఖర్ దావన్ 17 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ఉత్సేయ 2 వికెట్లు తీయగా, జార్విస్, చిగుంబుర తలో వికెట్ పడగొట్టారు. సెంచరీతో అద్భుత ప్రదర్శనను కనబర్చిన కెప్టెన్ విరాట్ కోహ్లికి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more