భారత క్రికెట్ టెస్టు చరిత్రలో ఇదో గొప్ప విజయం. ఇంత వరకు ఎప్పుడు క్లిన్ స్విప్ చేయలేని టీంఇండియా ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో క్లిన్ స్విప్ చేసి, చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా చేరుకుంది. పోయిన సంవత్సరం విదేశీ గడ్డపై, స్వదేశంలో జరిగిన కొన్ని సిరీస్ లో పరాజయాల పాలైన అనేక విమర్శలు ఎదుర్కొన్న ధోని సేన విజయం సాధించి ఆస్ట్రేలియా పై ఉన్న కసిని, కోపాన్ని తీర్చుకుంది. 43 ఏళ్ల తర్వాత ఇంత చెత్తగా (0-4తో వైట్వాష్) ఓడిన జట్టుగా ఆస్ట్రేలియా అప్రదిష్ట మూటగట్టుకుంది . నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన చివరి టెస్టులో భారత్ ఆరు వికెట్లతో ఘన విజ యం సాధించింది.
ఆటకు మూడోరోజైన ఆదివారం ఆసీస్ నిర్దేశించిన 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ధోనీసేన 31.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పుజారా (92 బంతుల్లో 11 ఫోర్లతో 82 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించ గా.. కోహ్లీ (60 బంతుల్లో 4 ఫోర్లతో 41) విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 266/8తో మూడోరోజు ఉదయం తొలిఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో ఆరు పరుగులు మాత్రమే జతచేసి మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్కు 10 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇ న్నింగ్స్కు దిగిన కంగారూలు.. భారత స్పిన్త్రయం జడేజా (5/58), ఓఝా (2/19), అశ్విన్ (2/55) ధాటికి 46.3 ఓవర్లలో 164 పరుగులకే చేతులెత్తేసింది. జడేజాకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ' దక్కగా, సిరీస్లో 29 వికెట్లు పడగొట్టి కుంబ్లే రికార్డు (27) ను అధిగమించిన అశ్విన్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ' సొంతం చేసుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more