ఇంగ్లాండ్ తో జరుతున్న టెస్ట్ సిరీస్ లో వరుసగా రెండు టెస్టులో పరాజయం పాలైన టీం ఇండియా పరువును ఇప్పటికే గంగలో కలిపింది. ఉన్న కాస్త పరువును పూర్తిగా గంగలో కలపకముందే బీసీసీఐ తేరుకొని నాగ్ పూర్ టెస్టుకు జట్టులో కొన్ని చేర్పులు మార్పులు చేసింది. ఈనెల 13 నుండి ప్రారంభం కానున్న టెస్టులో కొత్త వారికి చోటుస్తూ, వరుసగా విఫలం అవుతున్న సీనియర్ బౌలర్స్ అయిన జహీర్ ఖాన్, భజ్జీలనే కాకుండా ఇటీవలే టెస్టు జట్టులోకి వచ్చి, విఫలం అవుతున్న యువరాజ్ సింగ్ పై వేటు వేస్తూ, వారి స్థానంలో పీయూష్ చావ్లా, పర్విందర్ అవానా, జడెజాలకు చోటు కల్పించారు. ఇక మాస్టర్ మూడవ టెస్టులో కాస్తంత రాణించడంతో నాలుగో టెస్టుకు కూడా ఎంపిక చేశారు. ఈ మధ్యన వ్యూహాలు రచించడంలో విఫలం అవ్వడమే కాకుండా, పరాజయాల పాలైనప్పుడు వాటిని జట్టు సభ్యుల మీద నెట్టివేస్తూ ఉన్న ధోనికి ఈసారి చిరవరి అవకాశం ఇచ్చారు. నాగ్ పూర్ లో టెస్టులో ధోని సేన ఓడితే.... ఆయన నాయకత్వానికి కూడా ఉద్వాసన పలికే అవకాశం ఉందంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more