భారత్-న్యూజిలాండ్ మధ్య బెంగుళూరులో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 2-0 తేడాతో సిరీస్ ని కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ జట్టు 261 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. న్యూజిలాండ్ ఇచ్చిన లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన భారత ఆటగాళ్ళు ఆదిలోనే త్వర త్వరగా వికెట్లు కోల్పోయారు. గంభీర్, సెహ్వాగ్, సచిన్, తక్కువ స్కోర్లకే అవుటయినా, పూజారా మరోసారి బాధ్యాతాయుతమైన ఆటను ఆడి 48 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. పూజారా అవుట్ అయిన తరువాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరోసారి న్యూజిలాండ్ బౌర్లను చుక్కలు చూపెట్టడం, కోహ్లీకి జతగా ధోని కూడా కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడటంతో మరో రోజు మిగిలి ఉండగానే భారత్ రెండో టెస్టును ముగించింది. గంభీర్ 34, సెహ్వగ్ 38, పుజారా 48, సచిన్ 27, రైనా పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరగా.. కోహ్లీ 51, ధోని 48 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
న్యూజిలాండ్ జట్టులో పటేల్ 3 వికెట్లు, సౌథీ, బోల్ట్ చెరో వికెట్ పడగొట్టారు.అంతకుముందు 9 వికెట్ల నష్టానికి 232 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 248 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ జట్టు ముందు 262 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో అత్యధిక మ్యాచ్ లు గెలిచిన భారత కెప్టెన్ గా మహేంద్ర సింగ్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు.భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది సిరిస్ అవార్డు దక్కింది. గతంలో అజారుద్దీన్ పేరిట ఈ రికార్డు నమోదై ఉంది. న్యూజిలాండ్: 365, 248, భారత్ 353, 262/5.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more