అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు చెక్ పెట్టేందుకు ఉద్దేశించిన నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్) తప్పనిస రి చేసేందుకు ఐసీసీ కసరత్తు చేస్తోంది. టెస్టులు, వన్డేల్లో ఈ డీఆర్ఎస్ను తప్పనిసరి చేయాలని ఎగ్జిక్యూటివ్ కమిటీ ఐసీసీని కోరుతుంటే.. మొదట్నుంచీ డీఆర్ఎస్ను వ్యతిరేకిస్తున్న బీసీసీఐ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉంది. రెండ్రోజులపాటు ఇక్కడ జరిగిన ఐసీసీ సీఈసీ సమావేశాల్లో డీఆర్ఎస్ పనితీరుపై కంప్యూటర్ సాంకేతిక నిపుణుడు ఎడ్ రాస్టెన్ రూపొందించిన నివేదికను కమిటీ పరిశీలించింది. కొత్త హాట్స్పాట్ టెక్నాలజీ, బాల్ ట్రాకింగ్ విధానాలపై రాస్టెన్ అందించిన నివేదికపై ఎగ్జిక్యూటివ్ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్లో బాల్ ట్రాకింగ్ విధానం ఖచ్చితత్వంపై రాస్టెన్ పరీక్షించాడని, ఫలితాలు వంద శాతం అనుకూలంగానే వచ్చాయని కమిటీ తెలిపింది. అయితే, మ రో రెండ్రోజుల్లో సమావేశం కానున్న ఐసీసీ బోర్డు డీఆర్ఎస్ పై ఒక నిర్ణయానికి రానుంది. కాగా, గతేడాదే డీఆర్ఎస్ను తప్పనిసరి చేయాలని ఐసీసీ భావించగా, బీసీసీఐ ఒత్తిడితో వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more