శ్రీ కాళహస్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో వున్న ఈ పట్టణం ‘స్వర్ణముఖి’ నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇక్కడ దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన, పంచభూతలింగాలలో నాల్గవదైన వాయులింగం గల గొప్ప శైవ పుణ్యక్షేత్రం వుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలు. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది.