కాణిపాకం
చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన ఈ గ్రామంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలున్నాయి. ఇక్కడ వరసిద్ధి వినాయకుని ఆలయం ప్రశస్తి పొందింది. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. ఈ ఆలయంలో వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.