Tragedy at osmania hospital

osmania general hospital, tragedy at osmania hospita, victims of the dilsukhnagar blast, bomb blasts at dilsukhnagar, yderabad blast, hyderabad bomb blast, hyderabad twin blasts, osmania hospital

Tragedy at Osmania Hospital.The list of injured released by the office of Cyberabad police commissioner in the early hours of Friday shows 121 people were admitted to seven hospitals in the city

Osmania-ospital.gif

Posted: 02/22/2013 12:39 PM IST
Tragedy at osmania hospital

Tragedy at Osmania Hospital

దిల్‌సుఖ్‌నగర్ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడిన వారిలో 26 మందిని గురువారం రాత్రి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వృత్తి, విద్యా, ఉద్యోగ,షాపింగ్‌ల నిమిత్తం దిల్‌సుఖ్‌నగర్‌కు వచ్చి, దిల్‌సుఖ్‌నగర్ నుంచి వివిధ ప్రాంతాలకు తిరిగి వెళ్లాల్సిన వారిలో ఎక్కువ మంది సకాలంలో ఇంటికి చేరుకోకపోవటంతో వారి బంధువులు పెద్ద ఎత్తున ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. కానీ పోలీసులు వారిని ఆస్పత్రిలోకి అనుమతించకపోవటంతో ఆస్పత్రి ఆవరణ క్షతగాత్రుల బంధువుల ఆర్తనాదాలతో మారుమోగింది. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి మొత్తం 26 మందిని తీసుకురాగా, అందులో గురువారం అర్థరాత్రి వరకు 12 మంది మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు నిర్థారించారు. మృతుల్లో ఆదిలాబాద్ మంచిర్యాలకు చెంది ఎంబిఏ చదివిన ముత్యాల రాజశేఖర్(25) ఉద్యోగ అనే్వషణ నిమిత్తం నగరానికి వచ్చి బాంబు పేలుళ్లకు బలైనట్లు ఆయన బంధువులు వివరించారు. అదే ప్రాంతానికి చెందిన వడ్ల విజయ్‌కుమార్(30) కూడా ఎక్సైజ్ పోలీసు ట్రైయినింగ్ కోసం వచ్చి దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో ప్రాణాలు వదిలినట్లు తెల్సింది. అలాగే క్షతగాత్రుల్లో 13 మంది పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Tragedy at Osmania Hospital

అయితే క్షతగాత్రుల్లో తీవ్రగాయాలపాలైన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు గాను ఆస్పత్రిలోని 120 మంది వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నా, ప్రైవేటు వైద్యులను కూడా రంగంలో దంపినట్లు తెల్సింది. ఉస్మానియా ఆస్పత్రికి క్షతగాత్రులను తీసుకువచ్చిన తర్వాత పోలీసులు ఎవర్నీ కూడా లోనికి అనుమతించకపోవటంతో క్షతగాత్రుల బంధువులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  గ్రేటర్ కౌన్సిల్ టిడిపి ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు మరికొందరు తెలుగుదేశం నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న క్షతగాత్రులను వెంటనే గ్లోబల్, అపోలో ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఉస్మానియాలో అర్థరాత్రి వరకు వైద్యులు మృతి చెందినట్లు నిర్థారించిన 12 మంది మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఉస్మానియా ఆస్పత్రిలో విషాదం అలముకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Blast in dilsukh nagar in hyderabad
Cc camera not working bomb blast place  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more