విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజార్టీ ఉండాలని స్పష్టం చేశారు. అంతేకాదు దేశంలోని సగం రాష్ట్రాలు అంగీకరించాలని అన్నారు. అలాగే 371 (డి)ని సవరించాల్సిందేనని స్వయంగా భారత్ అటార్నీ జనరల్ స్పష్టం చేసిన సంగతిని టీజీ వెంకటేష్ గుర్తు చేశారు. 2014 ఎన్నికల నాటికి ఆ సవరణలన్ని జరిగే పని కాదని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరగదని ఆయన స్ఫష్టం చేశారు.
బిల్లుతో పాటు డబ్సు సంచులు
సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు దిగ్విజయ్సింగ్ యత్నిస్తున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. యుద్ధ విమానంలో తెలంగాణ ముసాయిదా బిల్లుతో పాటు డబ్బు సంచులు కూడా వచ్చాయని ఆరోపించారు. సోనియా తీరు హిట్లర్ను మరిపించేలా ఉందని మండిపడ్డారు. పదవుల కోసమే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మౌనం వహిస్తున్నారని ధూళిపాళ్ల వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 12 | ఈరోజుతో శీతకాలం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రజల ద్రుష్టి మొత్తం అసెంబ్లీ మీదే ఉంది. ఈరోజు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్తో పాటు కార్యదర్శులు తిరునావుక్కరసు, కుంతియాలు నగరానికి... Read more