ద్వాపరయుగంలో పాండవులు కృష్ణా, తుంగభద్రానదుల సంగమమున ప్రతిష్టాత్మక శైవక్షేత్రమైన ‘కూడలి సంగమేశ్వర క్షేత్రం’ ప్రతిష్టించారు. ఈ క్షేత్రము పాలమూరు జిల్లా అలంపూర్ తాలూకాలో కృష్ణా, తుంగభద్రల సంగమం (కూడలి) దగ్గర వెలసింది. ఈ పుణ్యక్షేత్రము కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య వెలసింది కాబట్టి.. అక్కడి ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ క్షేత్రములో మహాశివరాత్రి పర్వదినాన శివార్చనలు, సంబరాలు జరుగుతాయి.
పురాణ గాథ :
ద్వాపరయుగంలో పాండవులు మాయాజూదంలో ఓడిపోయిన అనంతరం అరణ్యంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని నివసించేవారు. అప్పుడు కౌరవులు తమ భోగభాగ్యాలను వారిముందు ప్రదర్శించాలన్న అహంకారంతో ‘ఘోషయాత్ర’ పేరిట బయలుదేరారు. అయితే.. కౌరవులను తమ శతృవులుగా భావించే గంధర్వులు.. వారిని బంధిచి గంధర్వలోకానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పసిగట్టిన పాండవాగ్రజుడు ధర్మరాజు.. గంధర్వుల చెరనుంచి కౌరవులను విడిపించమని భీముడు, అర్జునులను ఆదేశించాడు. అతని ఆదేశంమేరకు వారిద్దరూ గంధర్వుల చెరనుంచి విడిపించగా.. దానిని అవమానంగా భావించిన కౌరవ వీరులు అవమానంతో హస్తినాపురం చేరారు.
అపుడు కృష్ణుడు పాండవులను దండకారణ్యంలో గడపవలసిందిగా ఆదేశించగా.. వారు అరణ్య ప్రాంతాల్లో సంచరిస్తూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు. అక్కడి ప్రజలను ఆదరిస్తూ, వారి వారి మన్ననలను పొందుతూ సంచార జీవితము గడిపేవారు. అలా సంచరిస్తూ మనసులను జలవిన్యాసాలతో ఆహ్లాదపరచే కృష్ణ, తుంగభద్ర నదుల సంగమానికి చేరుకున్నారు. రెండు నదుల సంగమము (కూడలి) కావున సంగమేశ్వరుని ప్రతిష్టించి పూజలు చేసి తరించాలని ధర్మరాజు తన కోరికను తన భార్య, సోదరులకు వెల్లడించాడు.
అతని కోరికను నెరవేర్చాలని భావించిన భీమసేనుడు... తన శక్తిసామర్థ్యాలతో కాశి క్షేత్రం చేరతాడు. అక్కడ అన్నపూర్ణ, విశ్వనాథస్వాముల ప్రార్థన చేసి అక్కడనున్న ఒక పవిత్ర శివలింగాన్ని తీసుకొని ఆఘమేఘాలమీద కృష్ణా, తుంగభద్రల సంగమానికి చేరుకున్నాడు. పాండవులు సకల పూజా ద్రవ్యాలు సేకరించి రెండునదుల కలయిక గట్టుపై ఆ శివలింగమును ప్రతిష్టించి, పూజా కార్యక్రమములు సాగించారు. ఇలా ఈ విధంగా ఈ క్షేత్రం ఏర్పడింది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more