కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం వచ్చే ఏడాది తొలినాళ్లలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించినట్లు వుంది. దేశవ్యాప్త ప్రజలపై ఇంధన ధరలు ప్రభావం చూపిన విషయాన్ని గ్రహించిన సర్కార్.. ఇప్పటికే గత కొన్నిరోజులుగా వాటి జోలికి కూడా వెళ్లడం లేదు. అంతర్జాతీయంగా బ్యారెట్ క్రూడ్ అయిల్ ధరలు తగ్గినా.. వాహనాదారులకు మాత్రం ఆ ప్రయోజనాన్ని కల్పించకుండా ఎక్సైజ్ సుంఖం పేరుతో తన్నుకుపోయిన ప్రభుత్వం.. రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఆ ప్రభావం పడకూడదని ముందస్తు చర్యలకు తీసుకుంటోంది. దీంతో ఓ మెట్టు దిగిన ప్రభుత్వం ఇంధన ధరలపై భారీగా పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని కూడా స్వల్పంగా తగ్గించింది.
దాదాపు ఏడాది కాలంగా కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా పోరాడిన రైతుల విషయంలోనూ సర్కారు పలు మెట్టు దిగిన విషయం తెలిసిందే. సాగు చట్టాలను వెనక్కు తీసుకోవడంతో పాటు ఇకపై రైతులు పండించే పంటలకు ఎంఎస్పీ పై కూడా చట్టం తీసుకువస్తామని.. దాంతో పాటు రైతులు కోరిన పలు డిమాండ్లను కూడా నేరవేర్చుతామని అంగీకరిస్తూ ఏకంగా లిఖితపూర్వక హామిని కూడా ఇచ్చింది. దీంతో ప్రజల పల్స్ తమకు వ్యతిరేకంగా మారుతుందని అర్థమైన మోడీ సర్కర్ ఈ చర్యలకు పూనుకుందన్న ఊహాగానాలు ఊపందుకుంది. అందుకనే అటు ఇంధనం, ఇటు రైతు సమస్యలను దెబ్బకు పరిష్కారించాయని వాదనలు వినబడుతున్నాయి.
ఇక వంటగ్యాస్ సబ్సీడీ సిలిండర్ ధరను కూడా గత రెండు నెలలుగా పెంచేందుకు కూడా సాహపించడం లేదు. అయితే అంతకుముందే తమకు కావాల్సినంతగా పెంచేశారని విపక్షాలు అరోపిస్తున్నాయి. ప్రజలు వంటింట్లో ఇప్పటికే మోదీ సర్కార్ పోగ పెట్టిందని.. ఎన్నికల ముందు వారు ఎన్ని వేశాలు వేసినా.. గెలిచిన తరువాత వారు పెంచే ధరలను ప్రజలు మర్చిపోలేరని.. మనుషులను విభజించి పాలించే పరదేశీయులు వదిలివెళ్లిన సూత్రాన్ని పట్టుకున్న ప్రధాని.. పైకి మాత్రం ఐక్యత, ఒక్కటి, సభ్ కా వికాస్ అంటూ సూక్తులు చెబుతారని ఇప్పటికే విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. నాలుగేళ్లు ప్రజలపై భారం మోపి ఎన్నికల నేపథ్యంలో మాత్రం తగ్గిస్తూ మసిబూసి మారేడు కాయను చేస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక కరోనా లాంటి కష్టకాలంలోనూ కేంద్రం ప్రజలను అదుకునే చర్యలకు స్వస్తి పలికి.. ఓ వైపు రైళ్ల ప్రయాణాలపై భారం పెంచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన గొప్ప వ్యక్తుల ఇళ్లు కార్యాలయాలపై ఐటీ దాడులు కూడా నిర్వహించిన ఘటన కేంద్రంలోని మోడీ సర్కారుదేనని ఆరోపిస్తున్నారు. ఇలా విపక్షాలు ఎన్ని అరోపణలు చేస్తున్నా.. ప్రజలు తమ ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్న విషయాలను పసిగడుతూ.. వాటి ధరలను తగ్గించే చర్యలకు కేంద్రం పూనుకుంటోంది., ఇందులో భాగంగా తాజాగా వంటనూనెల ధరలను తగ్గించే ప్రయత్నాలకు కేంద్రప్రభుత్వం పూనుకుంది.
దేశీయంగా సరఫరా పెంచి, వంటనూనెల ధరలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా రిఫైర్డ్ పామాయిల్పై బేసిక్ కస్టమ్ సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. సవరించిన ఈ బేసిక్ కస్టమ్ డ్యూటీ (BCD) నేటి నుంచి అమలులోకి రానుండగా.. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు అమలులో ఉంటుందని సీబీఐసీ పేర్కొంది. డిసెంబర్ 2022 వరకు లైసెన్స్ లేకుండా రీఫైన్డ్ పామాయిల్ను దిగుమతి చేసుకునేందుకు వ్యాపారులకు అనుమతి ఉంటుందని సోమవారం జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.
ఇదే సమయంలో ముడి పామాయిల్, పలు ఇతర వ్యవసాయ వస్తువుల కొత్త డెరివేటివ్ ఒప్పందాలపై నిషేధం విధించింది. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. అంతకు ముందు జూన్లో నూనె ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు రిఫైర్డ్ పామాయిల్ దిగుమతిపై నిషేధం విధించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. సోమవారం రిటైల్ మార్కెట్లో వేరు శెనగ నూనె కిలో రూ.181.48, ఆవనూనె రూ.187.43, వనస్పతి రూ.138.5, సోయాబీన్ ఆయిల్ రూ.150.78, పొద్దుతిరుగుడు నూనె రూ. 163.18, పామాయిల్ రూ.129.94గా ఉంది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more