ఏపి నూతన రాజధాని అమరావతి శంఖుస్థాపనకు చంద్రబాబు ప్రభుత్వం అంతా సిద్దమవుతోంది. అందుకుగాను కావాల్సినఅ అన్ని ఏర్పాట్లను కూడా చంద్రబాబు నాయుడు ముందుండి పర్యవేక్షిస్తున్నారు. చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా. ప్రతి ఆంధ్రుడు తల ఎత్తుకునేలా అమరావతి ఏర్పాట్లను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది ఏపి ప్రభుత్వం. అయితే ఈ కార్యక్రమానికి అందరిని ఆహ్వానిస్తున్నారు చంద్రబాబు నాయుడు. జపాన్ ప్రధానిని, సింగపూర్ ప్రధానిని, ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్ లను, పలువురు రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానం పంపారు చంద్రబాబు నాయుడు. అయితే ప్రధాని నరేంద్ర మోదీని గతంలోనే కలిసిన చంద్రబాబు ఖచ్చితంగా అమరావతి శంఖుస్థాపనకు రావాలని మరీ మరీ చెప్పారు. అయితే తాజాగా అమరావతి శంఖుస్థాపనకు మోదీ వస్తారా .? రారా .? అన్న సందిగ్దం ఏర్పడింది. ఇలా ఎందుకు అని అనుకుంటున్నారా..?
అమరావతి శంఖుస్థాపనకు చంద్రబాబు నాయుడు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకుగాను అధికారులను పురమాయించారు. అయితే అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు. ప్రధాని మోదీ కూడా వస్తానని హామీ ఇచ్చినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. దసరా నాటి కార్యక్రమాల వివరాలను కూడా మీడియా కు వెల్లడించింది ప్రధాని కార్యాలయం. కానీ తాజాగా చంద్రబాబు నాయుడు మరోసారి దిల్లీకి ప్రయాణం కావడం.. మరోసారి మోదీతో భేటి కానుండటం చర్చనీయాంశంగా మారింది. మోదీ అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి రావడం లేదా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మోదీ ఆహ్వానం కంటే ముందు సింగపూర్ ప్రధానికి, జపాన్ ప్రధానికి చంద్రబాబు నాయుడు ఆహ్వానం పంపండం మోదీకి కాస్త కోపం తెప్పించింది అని సమాచారం. ఒకసారి ప్రధాని కార్యాలయం నుండి ప్రధాని షెడ్యూల్ విడుదల అయ్యాక కూడా చంద్రబాబు నాయుడు మళ్లీ మోదీతో భేటికి కారణాలు ఏంటా అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మోదీని ప్రసన్నం చేసుకోవడానికే తాజాగా దిల్లీ భేటి అని కూడా ప్రచారం నడుస్తోంది. మరి నిజంగా మోదీ అలకపూనారో లేదంటే వేరే కారణాలు ఉన్నాయో తెలియాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more