ఓటుకు కోట్లు కేసును తెలంగాణ ఏసీబీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సహా నలుగురిని ఇప్పటికే అరెస్టు చేసిన ఏసీబి.. ఇప్పుడు పలువురిని విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద పనిచేస్తున్న డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే యువనేత నారాలోకేష్ డ్రైవర్ కు నోటీసులు ఇచ్చిన ఏసీబికి.. తమ విచారణలో మరిన్ని విస్తుగోలిపే విషయాలను వెలుగుచూసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వీరి ఫోన్ నెంబర్లతో ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. రికార్డయిన కాల్ డేటా ఆధారంగా ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు. బుధవారం చంద్రబాబు ఇంటికి వెళ్లిన తెలంగాణ పోలీసులు, ఆయన ఇంటి సమీపంలో విచారించారు. చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేష్ వద్ద పనిచేస్తున్న భద్రత సిబ్బంది, వారి ఫోన్ నెంబర్లపైనా ఆరా తీశారు. వచ్చిపోయే కార్ల నెంబర్లను సేకరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మళ్లీ నోటీసులు ఇచ్చేందుకు హడావుడి చేసినట్టు సమాచారం.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విజయవాడ కోర్టు నోటీసులతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. కోర్టు నోటీసులు తదనంతర పరిణామాలపై సీఎస్ రాజీవ్ శర్మ శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాల్ డేటా భద్రపరచడంతోపాటు న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపినట్లు సమాచారం. విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు క్రితం రోజు సాయంత్రం ఏపీ పోలీస్ అధికారులు తెలంగాణ సీఎస్కు నోలీసులు అందజేశారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more