ఏపి ఏసీబీ అధికారుల దగ్గర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ట్రైనింగ్ తీసుకుంటున్నారని తాజాగా ఓ పుకారు షికారు చేస్తోంది. ఓటుకు నోటు కేసులో సండ్రను హాజరుకావాల్సిందా తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు పంపించారు. అయితే ఈ కేసు తీవ్రత రోజు రోజుకు పల్చబడుతున్నందునే రాలేదని కొందరు ప్రచారం చేస్తుంటే.. లేదు తెలంగాణ ACB విచారణకు ఆంధ్రాలో ట్రైనింగ్ ఇస్తున్నారని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో నోటీసులందుకున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య శుక్రవారం సాయంత్రం ఏసీబీ ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన రాలేదు ఓ లేఖ మాత్రమే వచ్చింది.
అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నానని, నియోజకవర్గం పర్యటనలో వెన్నునొప్పి, కుడికాలు నొప్పి రావడంతో డాక్టర్లు 10 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారని అందువల్ల రాలేకపోతున్నానని ఆ లేఖలో వివరించారు. కోలుకున్న వెంటనే వస్తానని, లేదా తానున్న ఆస్పత్రికి వచ్చినా సమాధానాలు ఇచ్చేందుకు సిద్దమే అని ఆ లేఖలో తెలిపారు. మరి సండ్ర నిజంగానే చికిత్స పొందుతుంటే ఏ ఆస్పత్రిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు అనే దానిపై క్లారిటీ లేదు. దీనిపై అనేక రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి..
విశాఖలో ఉన్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఒకవేళ సండ్రా విశాఖలో ఉంటే ఎందుకు అక్కడికి వెళ్లినట్లు ? నిజంగానే ఆసత్పికి వెళ్తే హైదరాబాద్ కు రాకుండా విశాఖకు ఎందుకు వెళ్లినట్లు.. ఇలాంటి ప్రశ్నలు గుప్పిస్తోంది బాబు వ్యతిరేఖ వర్గం. ఏపీలో ఏసీబీ అధికారులచే ట్రైనింగ్ ఇప్పిస్తున్నారని ఆరోపిస్తున్నారు.. తెలంగాణ ఏసీబీ అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి.... ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అనే అంశాలపై పూర్తిగా ప్రిపేర్ చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు..విశాఖలో ఏపీ ఏసీబీ అధికారులు సండ్రకు సూచనలు ఇస్తున్నారని చంద్రబాబు వ్యతిరేఖ వర్గం ప్రచారం చేస్తోంది.. చంద్రబాబును కేసు నుంచి తప్పించేందుకు సండ్రను పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేస్తున్నారని వార్తలు ప్రచారం చేస్తున్నారు..
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more