ఎన్నికలు సమాయం దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ నాయకులు తమ నాలుగు అంగుళాల నాలుకలకు .. పదునుపెడుతున్నారు. ఇప్పటికే కొంతమంది రాజకీయ నాయకులకు ఉన్న పదునుతోనే నాలుక తిప్పేసి వారి పరువును బజారు పాలుచేసుకుంటున్నారు. అలాంటి వారిలో మన తెలంగాణ గులాబీ బాస్ కేసిఆర్. ఉద్యమ దళపతి గా తెలంగాణ సాధించిన ఆనందంలో ఆయన నాలుక గడ్డి తింటుందని మెగా అభిమానులు ఆవేశంగా అంటున్నారు.
అదే కేసిఆర్ నాలుక ఎలా మాట్లాడితే..మెగా అభిమానులు ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడే ఒక చిన్న విషయం జరిగింది. గత రెండు వారాల నుండి, బుల్లితెర మీద, న్యూస్ పేపర్లో, టీ డబ్బా దగ్గర, పాన్ దుకాణం దగ్గర, బిరియానీ సెంటర్ వద్ద, చివరికి ఆర్టీసీ బస్సులో కూడా ఒక్కటే ముచ్చట గురించి చెప్పకుంటున్నారు.
ఏంటీ అంటారా.. హీరో పవన్ కళ్యాణ్ రాజకీయల్లోకి వస్తున్నాడట? రాష్ట్ర ప్రజల కోసం కొత్త పార్టీ పెడుతున్నాడట? పవర్ స్టార్ రాజకీయల్లో వస్తే చాలా మంచిందే, ఈ అవినీతి నాయకులు, బట్టేవాజ్ గాళ్ళు అందరు పోతేనే మనం బాగుపడతాం. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు రాజకీయల్లోకి రావాలని చెప్పుకుంటున్నారు.
ఇలా ప్రజలు మాట్లాడుకోవటంతో రాజకీయ నాయకులకు చెమట్లు పట్టి, బిపీలు పెరుగుతున్నాయి. ఈ టెన్షన్ కు గురైన తెలంగాణ దళపతి కేసిఆర్ మొదటిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..గులాబీ రంగు చల్లారు. గులాబీ రంగు అంటే నిజమైన రంగు కాదులేండి.? రాజకీయ నాయకుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మొదటి రాజకీయ కామెంట్ చేయటం జరిగింది. ‘‘ అన్న చిరంజీవి దుకాణం అయిపోయింది, ఇక తమ్ముడి దుకాణం షురూ అయిందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. సినిమా నటులను నమ్మి మోసపోవద్దని కోరారు. పవన్ కల్యాణ్, మరో పార్టీ పెడుతున్నారని పేర్కొన్నారు.
అన్న చిరంజీవి దుకాణం పోయి ఇప్పుడు తమ్ముడి దుకాణం మొదలవుతున్నదన్నారు. అంతేకాకుండా ఎన్నికలకు ముందు పుట్టి కొత్త పార్టీలన్నీ సంక్రాంతి పండక్కి ముందు గంగిరెద్దువాళ్ళతో సమానం అని అన్నారు. సంక్రాంతి పండగ అయిన వెంటనే గంగిరెద్దు వాళ్లు వెళ్లి పోతారు. అలాగే ఈ కొత్త పార్టీ పరిస్థితి కూడా అంతేనని కామెంట్ చేయటం జరిగింది.
కేసిఆర్ మాటలపై.. మెగా అభిమానులు ఆవేశంగా ఉన్నారు. కేసిఆర్ కూతురు కవిత, తెలంగాణ సాధన కోసం .. ‘‘తెలంగాణ జాగ్రుతి ’’ అనే సంఘం పెడితే తప్పులేదు? గద్దర్ పార్టీ పెట్టినప్పుడు, విమలక్క పార్టీ పెట్టినప్పుడు, నిన్నగా మొన్న తెరపైకి వచ్చిన మందా క్రిష్ణ మాదిగా పార్టీ పెట్టినప్పుడు కేసిఆర్ నోరు ఏమైందని మెగా అభిమానులు అడుగుతున్నారు. అంటే ఇప్పటి నుంచే కేసిఆర్ కు పవన్ భయం పట్టుకుంది కాబట్టి ఇలాంటి ఛీప్ విమర్శలు చేయటం జరిగిందని మెగా అభిమానులు అంటున్నారు.
‘‘ మీరు గానీ టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఉంటే మాత్రం .. వెంటనే తెలంగాణ పవర్ పుల్ యువ నాయకుడు హరిష్ రావు తప్పకుండా కొత్త పార్టీ పెట్టి, మీకు కాంగ్రెస్ పార్టీకి పట్టపగలు చుక్కలు, అర్థరాత్రి సూర్యుడ్ని చూపించే నాయకుడిగా పార్టీ పెట్టేవాడని తెలంగాణ లోని మెగా అభిమానులు అంటున్నారు’’. ఇప్పటి వరకు మంచి నాయకుడిగా, తెలంగాణ రాష్ట్రం సాధించిన మగధీరుడిగా కేసిఆర్ గురించి తెలుగు ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇలా ఛీప్ మాట్లాడి.. తెలుగు ప్రజలు ద్రుష్టిలో చులకన కావద్దని మెగా అభిమానులు అంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more