తెలుగు దేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావడానికి ఆపార్టీ అధినేత అపర ఛాణక్యుడు అయిన చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నాడు. ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఇన్ని రోజులు దూరంగా పెట్టిన వారిని కూడా ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో వారిని దగ్గరకు తీస్తున్నాడు. అందులో భాగంగానే ఇన్ని రోజులు దూరంగా పెట్టిన నందమూరి చిన్నోడు ఎన్టీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ప్రచారస్త్రంగా వాడుకోవడానికి మంతనాలు జరపడానికి తన కొడుకు లోకేష్ బాబును పంపినట్లు రాజకీయ వర్గాల సమాచారం.
జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరిక్రిష్ణ గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటుండటంతో జూనియర్ కూడా పార్టీతో అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నాడు. అయితే ఇటీవల ఎన్టీఆర్ వర్థంతి రోజున ఎన్టీఆర్ మాట్లాడుతూ... తన తాత స్థాపించిన పార్టీనీ వీడేది లేదని, తన వంతు సాకారం పార్టీకి ఎప్పుడు ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయడం నా బాధ్యత అని ప్రకటించడంతో ఇదే అవకాశంగా భావించిన బాబు... హరిక్రిష్ణను ప్రక్కన పెట్టి ఎన్టీఆర్ ని వాడుకోవాలని చూస్తున్నాడు.
ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే లోకేష్ బాబు ఎదుగలేడని భావించి ఎన్టీఆర్ ని ప్రక్కన పెట్టాడనే టాక్ టీడీపీ వర్గాల్లో ఉంది. అలాంటి ఎన్నికల కోసం బాబు లోకేష్ తో రాయభారం పంపడాన్ని చూస్తే.... అధికారం కోసం తనకు అయిన వారిని కూడా అణగదొక్కుతాడని పేరున్న బాబుగారు ఎన్టీఆర్ ని ఆహ్వానించడానికి లోకేష్ ని పంపించారంటే… చంద్రబాబు వ్యూహం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ బాబును కలిసి అన్ని విషయాలు చర్చిస్తాడని, అదే టైంలో నేను ఎన్నికల్లో ప్రచారం చేయాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయని చెప్పి లోకేష్ బాబుకు చెప్పి పంపించాడట. ఏమైనా చంద్రబాబు అపర చాణక్యుడు కదా.
Knr
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more