వర్షం పడుతున్నప్పుడు. లేదా రోడ్డుపై నీళ్లు నిలిచినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే స్థానిక పురపాలక సంఘం అధికారులతో పాటు.. విద్యుత్ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. వర్షం పడే సమయంలో విద్యుత్ స్థంబాలను తాకరాదని కూడా వారు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ అవగాహనా రాహిత్యంతో గ్రామీణ ప్రాంత ప్రజలు.. అలా చేస్తూనే ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావంతో సామాన్య ప్రజల్లోనూ కొంత అవగాహన కలిగింది. అయితే మనుషులకు ఏమైనా చెప్పోచ్చు, కానీ మూగజీవాల సంగతేంటి.?
వర్షం పడుతున్న సమయంలో రోడ్డుపైనున్న విద్యుత్ స్థంబాలను తాకరాదని వాటికి ఎవరు చెప్పాలి. వాటికోసం ఎన్ని బోర్డులు పెట్టినా ఫలితం ఏంటీ.? మాట్లాడమే రాని మూగ జీవాలకు ఇక చదవడం ఎలా వచ్చు.? అందుకనే విద్యుత్ స్థంబాలు ఉన్న చోట దాని చుట్టూ కంచె ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. చుట్టూ నీళ్లు..మధ్యలో స్థంభం.. ఆ స్థంభం వద్దకు వచ్చిన ఓ ఆవు కరెంట్ షాక్తో గిలగిలా కొట్టుకుంది. ఇది చూసి ఓ దుకాణ యజమాని చలించిపోయాడు. వెంటనే ప్రాణాలకు తెగించి ఆ ఆవును కాపాడాడు. మానవత్వాన్ని చాటుకున్నాడు. పంజాబ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను ‘అనామిక జైన్ ఆంబర్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఆవు ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని తాకడంతో కరెంటు షాక్కు గురై కొట్టుకుంటోంది. ఆ ఆవును చూసిన దుకాణదారుడు పరుగెత్తుకుంటూ వచ్చి నీట్లోకి దూకాడు. ఓ గుడ్డతో ఆవు కాళ్లను కట్టి లాగాడు. చుట్టుపక్కలవారి సహాయంతో దాన్ని ప్రాణాలతో కాపాడాడు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకు లక్షకుపైగా లైక్స్ రావడం విశేషం. ఆ దుకాణాదారుడిని రియల్ హీరో అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Not all heroes wear capes...
— Righty nor Lefty (@akhilnaithani) July 3, 2022
In Mansa, a cow got electrocuted near an electric pole and started suffering. A nearby shopkeeper dragged the cow with a cloth which saved the life of the cow. #Heroes #TheBoys #india pic.twitter.com/vLep9VJyXZ
(And get your daily news straight to your inbox)
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more
Aug 13 | తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి...... Read more
Aug 12 | ఉచిత తాయిలాలు వద్దన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి విమర్శలు గుప్పించారు. ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను పొందుతున్న ఉచితాలేంటో... Read more