దేశంలో రాష్టప్రతి ఎన్నికలకు తెర లేచిన సందర్భంలో ఈ ఎన్నికలు ఇద్దరు వ్యక్తులకు సంబంధించినవి కావని, రెండు సిద్దాంతాల మధ్య పోరుగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కోన్నారు. దేశంలో నెలకొన్న ‘అసాధారణ పరిస్థితుల్లో’ రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. అయితే ఈ సిద్దాంతాలకు వ్యతిరేకంగా ఎన్నికలు ముగిసిన తరువాత కూడా పోరు కొనసాగుతూనే ఉంటుందని సిన్హా అన్నారు. తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు చెప్పారు. చాలా రోజులుగా కేంద్రం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నానని ఆయన చెప్పుకోచ్చారు.
దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నామని అన్నారు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటం. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి మంచివి కాదు. ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా..? ఇదేనా ప్రజాస్వామ్యమని ఆయన ప్రశ్నించారు. ప్రధాని ఎప్పుడు ఏకాభిప్రాయంపై విశ్వసించలేదని, కేవలం ఘర్షణాత్మక వాతావరణాన్ని మాత్రమే ఆయన నమ్ముతున్నారని అరోపించారు. ఈ విధానాలపై ఇప్పుడు చేసే పోరాటం భారత్ భవిష్యత్తు కోసం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేసేదేనని ప్రజలు, ప్రజాప్రతినిధులు గుర్తించాలన్నారు.
అటల్ బిహారీ వాజ్పేయి క్యాబినెట్లో తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యర్థులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఉపయోగించవచ్చని తాను ఊహించలేదన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జలవిహార్లో ఏర్పాటు చేసిన సభలో యశ్వంత్ సిన్హా మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తమకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రతినిధులు చూపించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.దేశానికి కేసీఆర్ వంటి నేత అవసరమని... కేసీఆర్తో మరోసారి సమావేశమవుతానని యశ్వంత్ సిన్హా అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more