అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా దేశంలోని అన్ని వస్తువుల ధరలు పెరగడంతో పాటు ఔషధాల ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్లో ఈ పరిస్థితులు ఇప్పటికే ఆందోళనకరంగా ఉన్నాయి. ఉత్తరాఖండ్లో ఔషధాల ధరలు 30శాతం మేర పెరిగాయి. ఈ రేట్లు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పెరిగిన ధరలు ఇప్పటికే మార్కెట్లో అమల్లోకి వచ్చేశాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ఔషధాల తయారీకి కావాల్సిన ముడిసరకుధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఔషధ తయారీదారుల అసోసియేషన్ హెడ్ ప్రమోద్ కలాని అన్నారు. అదే సమయంలో రూపాయి విలువ బలహీనపడుతోందని గుర్తుచేశారు. ఫలితంగా ఆ ప్రభావం ప్రజలపై పడుతోందని, ఔషధాల ధరలు పెరుగుతున్నాయని అన్నారు. జ్వరం కోసం వినియోగించే పారాసిటమాల్కు సంబంధించిన ముడిసరకు ధర గతంలో రూ. 5వేల/కేజీగా ఉంటే.. ఇప్పుడది కేజీకి రూ. 9వేలకు చేరింది. అందువల్ల ధరలు 10శాతం- 30శాతం మేర పెరిగాయని తెలిపారు.
మరోవైపు చమురు ధరలు, ద్రవ్యోల్బణం, అనిశ్చితి కారణాలతో ఔషధాల తయారీ సంస్థలు.. ధరల పెంపునకు మొగ్గుచూపుతున్నట్టు ఉత్తరాఖండ్ స్టేట్ డ్రగ్ కంట్రోల్ తజ్బార్ జగ్గి పేర్కొన్నారు. జ్వరం ట్యాబ్లెట్లతో పాటు బీపీ, షుగర్ మందులు కూడా ఉత్తరాఖండ్లో పెరిగిపోయాయి. షుగర్ ఇంజెక్షన్ (రైజోడెగ్).. గతంలో రూ. 1024గా ఉండగా ఇప్పుడది రూ. 1126కు చేరింది. షుగర్ మెడిసిన్ గ్లైకోమెట్.. గతంలో రూ. 155 నుంచి ప్రస్తుతం రూ. 170కి పెరిగింది. లివిర్ మెడిసిన్ ఉడిలివ్.. రూ. 580 నుంచి రూ.694కు వెళ్లింది. ద్రవ్యల్బణం దిగిరాకపోతే.. దేశవ్యాప్తంగా ఔషధాల ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more