హర్యాణలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఉదయం వేళ నడుస్తూ వెళ్తున్న ఓ కష్టజీవి గొంతు నులిమి నడిరోడ్డుపై దోపిడీకి పాల్పడ్డారు. హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10వ తేదీని జరిగిన ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు పిర్యాదు చేయకపోవడంతో పోలీసులు ఈ ఘటనపై ఆలస్యంగా స్పందించాల్సి వచ్చింది. అయితే ఓ వైపు దొంగల కోసం అన్వేషిస్తూ.. మరోవైపు బాధితుడిని కూడా వెతికారు పోలీసులు. ఈలోగా నిందితుల సమాచారం తెలియడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నేరాన్ని అంగీకరించిన నిందితులు.. వారు వెల్లడించిన నేరాల చిట్టా విని అవ్వాకయ్యారు.
బాధితుడి నుంచి 7వేల 900 నగదు, ఇటీవలే కొనుగోలు చేసిన కొత్త రూ.6000 విలువైన సెల్ ఫోన్ ను దొంగిలించి పారిపోయారు. ఇందుకు సంబంధించిన సిసిటీవీ ఫూటేజీని స్థానికంగా గల హార్డ్ వేర్ దుకాణం నుంచి పోలీసులు సేకరించడంతో వారు చేసిన దారుణ ఘటన వెలుగుచూసింది. ఇద్దరు కరుడుగట్టిన నేరగాళ్లను పోలీసులకు చిక్కేలా చేసింది. నిందితులను గుర్తుపట్టడంతో పాటు వారిని అదుపులోకి తీసుకునేందుకు కూడా ఈ సీసీటీవీ దృశ్యాలు పోలీసులకు దోహదపడ్డాయి. బాధితుడిని సురేష్ ముఖియాగా గుర్తించిన పోలీసులు అతను ప్రేమ్ నగర్లోని ఓ ఉక్కు వ్యాపారి వద్ద హెల్పర్ గా పనిచేస్తున్నాడని తెలుసుకున్నారు.
ఈ నెల 10వ తేదీన ఉదయం 6.’25 నిమిషాలకు తమ గ్రామానికి చెందిన మధ్యవర్తి ద్వారా తమ కుటుంబసభ్యులకు డబ్బు పంపాలని నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని వద్ద డబ్బులు వున్నాయని పసిగట్టిన ఇద్దరు దుండగులు అతడ్ని శివాజీ నగర్ లో ఓ దుకాణం వద్ద అడ్డగించి అతని గోంతు నులిమి.. జేబులోని డబ్బును, ఇటీవలే కొన్న కొత్త సెల్ ఫోన్ ను అపహరించారు. అయితే ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా అది సాధ్యకాలేదు. ఇక ఈ నేపథ్యంలో ఓ దుండగుడు డబ్బుల కోసం ఎకంగా బాధితుడి ఫ్యాంటును కూడా చించేసి మరీ అందులోంచి డబ్బును దొంగలించాడు.
అయితే హార్డ వేర్ దుకాణం నుంచి లభించిన ఫూటేజీ ఆధారంగా దుండగులను పట్టుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వివరాలను తెలుపుతూ.. ఏసీపీ ప్రీత్ పాల్ సంగ్వాన్ సురేష్ ముఖియా నుంచి నడిరోడ్డుపై డబ్బులు దొంగలించిన ఇద్దరిని సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేశామని తెలిపారు. వీరిలో ఒకరు రాజు అలియాస్ కాలియా (40), రెండవ నిందితుడు వివేక్ తివారీ (21) అని వీరు సెక్టార్ 5లోని లక్ష్మణ్ విహార్ లో నివసిస్తున్నారని, అయితే వీరు బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారని తెలిపారు.
కాగా, వీరికి నేరాలు కొత్త కాదని, ఇప్పటి వరకు ఏకంగా 24 నేరాలకు పాల్పడ్డారని, పలుమార్లు జైలుకు కూడా వెళ్లివచ్చారని పోలీసులు తెలిపారు. అక్రమంగా ఆయుధాలను కలిగి వున్న కేసులు కూడా వీరిపై నమోదై వున్నాయని తెలిపారు. వీరిద్దరూ పోరిగింట్లో ఉంటున్నారని వీరి జల్సాల కోసం అక్రమాల మార్గాన్ని ఎంచుకున్నారని పోలీసులు తెలిపారు. సురేష్ ముఖియా ఆ రోజు మధ్యవర్తి ద్వారా తమ కుటుంబానికి డబ్బును పంపడానికి వెళ్తున్నాడని తెలుసుకుని అతడ్ని వెంబడించినట్లు చెప్పారు. వీరిని న్యాయస్థానంలో ముందు ప్రవేశపెట్టి ఒక్క రోజు కస్టడీకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more