ఓ వైపు మహారాష్ట్రలో బీజేపి అధికార ప్రతినిధి వినయక్ అంబేకర్ పై దాడి చేసిన నేపథ్యంలో దిగ్గుబాటు చర్యలకు దిగిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీపై మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా సంచలన అరోపణలు చేసింది. అధికారమే పరమావదిగా భావిస్తున్న ఎన్సీపీ మిత్రపక్షాన్ని నమ్మకద్రోహం చేసేందుకు కూడా వెనుకాడటం లేదని అరోపించింది. మహారాష్ట్రలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నానా పటోలె అరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎన్సీపి ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపితో జతకట్టిందని సంచలన అరోపణలు చేశారు.
మిత్రపక్షంగా కోనసాగుతూనే.. వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతూ కాంగ్రెస్ ను బలహీన పర్చే చర్యలకు పూనుకుంటున్న ఎన్సీపి వ్యవహారాలపై తమ పార్టీ హైకమాండ్కు విషయం నివేదించానని ఆయన చెప్పుకొచ్చారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన ఆపై ఎన్సీపీ, కాంగ్రెస్లతో కలిసి మహా వికాస్ అఘడి (ఎంవీఏ) సర్కార్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, గత రెండున్నరేండ్లుగా మహారాష్ట్రలో తమ పార్టీని ఎన్సీపీ బలహీనపరుస్తోందని ఆయన నాగపూర్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ నానా పటోలె వ్యాఖ్యానించారు.
ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు ఇతర స్ధానిక సంస్ధలకు ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తగినన్ని నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. గొందియా జిల్లా పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా ఎన్సీపీ బీజేపీతో చేతులు కలిపిందని అన్నారు. భివాండి-నిజాంపూర మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 19 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లను ఎన్సీపీలో చేర్చుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయాలను తాము పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువచ్చామని, అయితే రానున్న రోజుల్లో పార్టీ మహారాష్ట్ర సర్కార్ పై కూడా నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
ఉదయ్పూర్లో ఇటీవల ముగిసిన పార్టీ చింతన శిబిరంలో ఈ విషయాలను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ ఆగస్ట్, సెప్టెంబర్లో ప్రారంభమవుతుందని నానా పటోలె తెలిపారు. రాహుల్ గాంధీని తమ నేతగా పార్టీ కార్యకర్తలు కోరుతున్నారని చెప్పారు. ఈ ఎన్నిక పూరైన తరువాత కాంగ్రెస్ మహావికాస్ ఆఘడి సర్కార్ పై దృష్టిసారిస్తుందని తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా రాష్ట్ర నాయకత్వం బలమైన ప్రణాళికలను రూపోందిస్తుందని.. వాటిని అములు పర్చడంతో రాష్ట్రంతో పాటు దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ పుర్వవైభవాన్ని కోనసాగిస్తుందని విశ్వాసన్ని వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more